అనుష్క షాకింగ్ నిర్ణయం.. ఆందోళనలో అభిమానులు..!

- Advertisement -

‘రబ్ నే బనాది జోడి’ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అనుష్క శర్మ. అలా వరుస హిట్‌ సినిమాలతో దూసుకెళ్లింది. కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని సినిమాలు తగ్గించేసింది. అనంతరం ఓ పాపకు జన్మనిచ్చి తల్లి కూడా అయింది. అనుష్క శర్మ పెళ్లి.. పిల్లల తరువాత కూడా ఏమాత్రం ఫిట్ నెస్ కోల్పోకుండా.. అదే గ్లామర్‌ను మెయింటేన్ చేస్తోంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లు కూడా చేస్తోంది బ్యూటీ.

అనుష్క శర్మ
అనుష్క శర్మ

ప్రస్తుతం అనుష్క సినిమాల కంటే కుటుంబానికే ఎక్కువ టైమ్‌ కేటాయిస్తుంది. ఇప్పటికే కొంచెం నిరాశలో ఉన్న తన అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది అనుష్క. తన ఫ్యూచర్ మూవీ కెరీర్ గురించి.. ఆమె చేసిన కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. ఈమధ్య కాలంలో ఆమె నటించిన సినిమా అంటే.. చెక్ దే ఎక్స్ ప్రెస్. ఈసినిమాతో అనుష్క శర్మ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. టీమిండియా ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 2023 డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క శర్మ షాకింగ్‌ ప్రకటన చేసింది.

“నా కూతురు వామికకు ఇది చాలా కీలకమైన సమయం. తనను దగ్గరుండి చూసుకోవాలి. విరాట్ కూడా చాలా బాగా చూసుకుంటాడు. కానీ తల్లిగా నా బాధ్యత నేను చేయాలి. అందుకే వామిక, విరాట్ కోసం, నా కుటుంబం కోసం సమయం ఇవ్వడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై ఏడాదికి ఒకటే సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం అభిమానులకు బాధ కలిగిస్తుందని తెలుసు. కానీ నా కుటుంబం కోసం నేను సమయాన్ని ఇవ్వాలి. నటిగా, భార్యగా, తల్లిగా, ఓ సెలబ్రిటీగా ప్రతి పాత్రను ఆస్వాదించాను. ప్రస్తుతానికి తల్లి పాత్రలో సంతృప్తిగా ఉన్నాను” అని అనుష్క తెలిపింది. ఈ ప్రకటనతో ఫ్యాన్స్‌ నిరాశకు గురవుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here