ఆ స్టార్ కమెడియన్ తో శ్రీదేవి అంతలా రొమాన్స్ చేసిందా..? ఈమె చరిత్ర మామూలుగా లేదుగా!

- Advertisement -

ఇప్పుడు ప్రతీ స్టార్ హీరో/ హీరోయిన్ ఒకటి రెండు సినిమాలు ఇతర భాషల్లో క్లిక్ అవ్వగానే పాన్ ఇండియన్ స్టార్స్ అని ఊహించేసుకుంటున్నారు. నిర్మాతల ముందు బడాయి చూపిస్తూ ఇష్టమొచ్చినట్టు రెమ్యూనరేషన్స్ ని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. కానీ పాన్ ఇండియా అనే పదానికి అసలు సిసలు నిర్వచనం చెప్పిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి.

శ్రీదేవి
శ్రీదేవి

ఈమె బాలనటిగా కెరీర్ ని ఆరంభించి,ఆ తర్వాత చిన్న వయస్సులోనే హీరోయిన్ గా మారి ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున మరియు వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. అంతయు కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన ఈమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు క్యూ కట్టాయి. అక్కడ కూడా ప్రముఖ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.

అయితే ఈ స్థాయికి ఎదిగిన శ్రీదేవి కెరీర్ ప్రారంభం లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంది. హీరోయిన్ కాకముందు కొన్ని చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చేది. అలా 1975 వ సంవత్సరం లో సూపర్ స్టార్ కృష్ణ హీరో గా నటించిన ‘దేవుడు లాంటి మనిషి’ అని ఒక చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ రాజబాబు కి జోడిగా శ్రీదేవి నటించింది.

- Advertisement -

అంతే కాదు వీళ్లిద్దరి మధ్య ఒక డ్యూయెట్ సాంగ్ కూడా ఉండడం విశేషం. అప్పట్లో ఈ పాట పెద్ద హిట్ అయ్యింది. ఇలా కమెడియన్ తో కూడా శ్రీదేవి అప్పట్లో రొమాన్స్ చేసింది అనే విషయం తెలుసుకొని అందరూ షాక్ కి గురయ్యారు. అలా శ్రీదేవి కూడా కెరీర్ ప్రారంభం లో ఇలాంటివన్నీ చూసేసి వచ్చిదంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here