చనిపోయిన ఇన్నేళ్లకు శ్రీదేవి చివరికోరిక తీర్చిన బోనీకపూర్.. ఏం చేశాడంటే..!

- Advertisement -

అతిలోక సుంద‌రి శ్రీదేవి గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. 24 ఫిబ్ర‌వ‌రి 2018న‌ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిన‌ప్ప‌టికీ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఆమె ఇంకా జీవించే ఉంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలంద‌రితో న‌టించిన శ్రీదేవి దుబాయ్‌లో బాత్రూంలో కాలుజారి ప్రమాదవశాత్తు మ‌ర‌ణించింది. ఆమె చ‌నిపోయి ఐదేళ్లు కావొస్తోంది.

శ్రీదేవి
శ్రీదేవి

ఇన్నాళ్లకు ఆమె చిర‌కాల కోరిక‌ను భ‌ర్త బోనీకపూర్ తీర్చారు. 80వ ద‌శ‌కంలో హీరోయిన్‌గా కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో శ్రీదేవి చెన్నైకి స‌మీపంలోని మహాబలిపురం ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌లో బీచ్‌ దగ్గర 5 ఎక‌రాలు కొనుగోలు చేసింది. ఇక్క‌డ తన డ్రీమ్ హౌస్ క‌ట్టుకోవాల‌ని ఎంతో ఆశ‌ప‌డింది. అయితే.. ఆ కోరిక తీర‌కుండానే ఆమె అంద‌రినీ విడిచివెళ్లిపోయింది. త‌న భార్య చిర‌కాల కోరిక‌ను భ‌ర్త, బాలీవుడ్ నిర్మాత‌ బోనీక‌పూర్ ఇన్నాళ్లకు నెర‌వేర్చారు. తాజ్‌ గ్రూప్‌ పార్ట్‌నర్‌షిప్‌లో హోటల్‌గా అభివృద్ధి చేశారు. “ఇది శ్రీదేవి కల. ఆమె డ్రీమ్‌ను నెరవేర్చేందుకు రెండేళ్లుగా డెవలప్‌మెంట్‌ పనులు చేపట్టి.. ఫైనల్‌గా బీచ్‌ హౌస్‌ను పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది.” అని బోనీకపూర్ చెప్పారు.

శ్రీదేవి డ్రీమ్‌ హౌస్‌ లొకేషన్‌ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ త‌ల్లి బాట‌లోనే ప‌య‌నిస్తోంది. శ్రీదేవి కూతురిగా ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపుని తెచ్చుకుంది. ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న ‘దేవ‌ర’ సినిమాతో ఆమె టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఇటీవ‌లే ఈ సినిమా నుంచి విడుదలైన జాన్వీకపూర్‌ లుక్ వైర‌లైన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here