‘ఖుషి’ కి దరిదాపుల్లో రాలేకపోతున్న ‘సింహాద్రి’ రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందంటే!

- Advertisement -

ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ ఒక రేంజ్ లో కొనసాగుతుంది, పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’, ‘జల్సా’ సినిమాలు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ చిత్రం రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించాయి. ఈ సినిమాలు గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో ఇతర హీరోల అభిమానులు కూడా తమ సినిమాలను రీ రిలీజ్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు.

ఖుషి
ఖుషి

కానీ ఈ చిత్రాలు సృష్టించిన రేంజ్ వసూళ్ల సినిమాని సృష్టించలేకపోయారు, ఇప్పుడు అందరి చూపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రం వైపు ఉంది. ఈ నెల 20 వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తో పాటుగా ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ గా రీ రిలీజ్ కి ప్లాన్ చేసి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు.

అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయి, కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ చిత్రం ఖుషి ని కాదు కదా, కనీసం జల్సా రికార్డుని కొట్టడం కూడా కష్టమే అని అంటున్నారు. ఖుషి మొదటి రోజు దాదాపుగా నాలుగు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.

- Advertisement -

ఈ చిత్రం తర్వాత జల్సా చిత్రం మూడు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లతో రెండవ స్థానం లో ఉంది.సింహాద్రి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతం లో కేవలం 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. సినిమా విడుదలకు సరిగ్గా నాలుగు రోజుల సమయం ఉంది, ఈ నాలుగు రోజుల్లో పుంజుకుంటే జల్సా మొదటి రోజు వసూళ్లకు దగ్గరగా వెళ్లే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here