‘సింహాద్రి’ రీ రిలీజ్ 3 రోజుల వసూళ్లు ‘ఖుషి’ మొదటి రోజు కంటే తక్కువనా!

- Advertisement -

భారీ పబ్లిసిటీ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం సింహాద్రి ఆయన పుట్టినరోజు సందర్భంగా రీసెంట్ గానే 4K టెక్నాలజీ తో మార్చి రీ రిలీజ్ చేసారు. ఏ రీ రిలీజ్ సినిమాకి లేని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు. ఈ ఈవెంట్ కి విశ్వక్ సేన్ లాంటి సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. ఇంత గ్రాండ్ ప్లానింగ్ చేసారు కాబట్టి కచ్చితంగా ఈ చిత్రం రీ రిలీజ్ అయిన చిత్రాలలో ఆల్ టైం రికార్డు సృష్టిస్తుందని అందరూ అనుకున్నారు.

సింహాద్రి రీ రిలీజ్
సింహాద్రి రీ రిలీజ్

అలా భారీ అంచనాల నడుమ సుమారుగా 1200 షోస్ తో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు ఖుషి రీ రిలీజ్ రెకార్డుకి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ఇక రెండవ రోజు అయితే కేవలం 15 లక్షల రూపాయిల గ్రాస్ ని సొంతం చేసుకోగా, మూడవ రోజు కేవలం 7 లక్షల రూపాయిల గ్రాస్ ని మాత్రమే అందుకుంది.

Simhadri re release

అలా ఈ చిత్రం మూడు రోజులకు కలిపి మూడు కోట్ల 72 లక్షల రూపాయిల గ్రాస్ ని సొంతం చేసుకుంది. రీ రిలీజ్ కలెక్షన్స్ పరంగా ఇది ఆల్ టైం టాప్ 2 చిత్రం అయ్యినప్పటికీ, ఖుషి చిత్రాన్నే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి ఆ సినిమాతో పోల్చి చూస్తే చాలా తక్కువే అని చెప్పాలి. ఖుషి మొదటి రోజు నాలుగు కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

- Advertisement -
JR NTR

సింహాద్రి చిత్రం మూడు రోజులకు కలిపి కూడా అంత వసూళ్లు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక నిన్నటితోనే ఈ చిత్రానికి క్లోసింగ్ కలెక్షన్స్ పడిపోయినట్టే అని, ఇక ఈరోజు నుండి ఏ ప్రాంతం లో కూడా గ్రాస్ వసూళ్లు రావని అంటున్నారు. ఎదో ఊహిస్తే ఇంకేదో అయ్యిందని నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు. వచ్చే ఏడాది అదుర్స్ చిత్రం ని రీ రిలీజ్ చేస్తామని, ఆ చిత్రం తో ఈసారి రికార్డు మిస్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు, చూడాలి మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here