3 కోట్లు ఖర్చు చేసారు.. కానీ రెండు రోజుల్లో ‘సింహాద్రి’ రాబట్టింది ఇంతేనా!

- Advertisement -

టాలీవుడ్ లో నేటి తరం మాస్ హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుస లో ఉంటాడు. 19 ఏళ్ళ వయస్సు లో ఎవరూ చూడని రేంజ్ స్టార్ స్టేటస్ ని చూసాడు ఆయన. ఆయనకీ అలాంటి స్థాయిని ఇచ్చిన చిత్రం ‘సింహాద్రి’.

సింహాద్రి
సింహాద్రి

ఆరోజుల్లో 24 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఆల్ టైం టాప్ 2 హిట్ గా నిల్చిన ఈ చిత్రం 150 కి పైగా కేంద్రాలలో 100 రోజులు మరియు 50 కి పైగా 175 కేంద్రాలలో విజయవంతంగా రన్ అయ్యి సెన్సేషన్ సృష్టించింది. అలాంటి చిత్రాన్ని ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసారు. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, ఆల్ టైం రికార్డుని మాత్రం పెట్టలేకపోయింది.

ఇప్పటికీ రీ రిలీజ్ మూవీస్ లో నెంబర్ 1 స్థానం లో పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రమే ఉంది. ఆ సినిమా మొదటి రోజు నాలుగు కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చెయ్యగా, సింహాద్రి చిత్రం 4 కోట్ల 5 లక్షల రూపాయిల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది.ఇక రెండవ రోజు అయితే ఈ చిత్రం ప్రతీ సెంటర్ లో దారుణంగా పడిపోయింది. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి రెండవ రోజు 20 లక్షల రూపాయిల గ్రాస్ కంటే తక్కువ వసూళ్లు వచ్చాయట.కొన్ని ప్రాంతాలలో ఆడియన్స్ లేకపోవడం తో ‘బిచ్చగాడు 2’ చిత్రాన్ని వేసుకున్నారు.

- Advertisement -
Simhadri

సింహాద్రి రీ రిలీజ్ కోసం ఎన్టీఆర్ టీం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పబ్లిసిటీ కనీవినీ ఎరుగని రేంజ్ లో చేసారు. మళ్ళీ ప్రత్యేకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిపించారు, వీటి మొత్తానికి టీం కి మూడు కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యిందట. అంటే కచ్చితంగా ఈ చిత్రం నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం. ఇప్పటి వరకు ఈ చిత్రం షేర్ లెక్కల్లో కోటి కి పైగా రాబట్టింది. అంటే టీం కి సాలిడ్ గా రెండు కోట్లు నష్టం అన్నమాట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న అంశం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here