రాకేష్ మాస్టర్ శవం దగ్గర శేఖర్ మాస్టర్ చేసిన పని తెలిస్తే కన్నీళ్లు ఆగవు

- Advertisement -

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితం వైజాగ్ షూటింగ్ వెళ్లిన రాకేష్ మాస్టర్.. అక్కడి నుండి హైదరాబాద్ వచ్చిన తర్వాత అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణానికి వడ దెబ్బ కారణం అయ్యి ఉండోచ్చని అంటున్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు, అభిమానులు రాకేష్‌ మాస్టర్‌ చివరి చూపు చూసుకోవడానికి వస్తున్నారు.

శేఖర్ మాస్టర్
శేఖర్ మాస్టర్

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్‌ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్స్‌ రాకేష్‌ మాస్టారి దగ్గరే డ్యాన్స్‌ పాఠాలు నేర్చుకున్నారు. వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ఎందుకోగానీ రాకేష్‌ మాస్టర్‌, శేఖర్‌ మాస్టర్‌ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయంపై శేఖర్‌ మాస్టర్‌ ఎప్పుడూ స్పందించలేదు కానీ కొన్ని సందర్భాల్లో రాకేష్‌ మాస్టర్‌ శేఖర్‌ మాస్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన తన గురువు కడసారి చూపుకోసం వస్తారా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి.

Rakesh Master

అయితే తన గురువు మరణవార్త తెలియగానే సోమవారం నేరుగా ఆయన ఇంటికి వెళ్లారు శేఖర్‌ మాస్టర్‌. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. ఈక్రమంలో మాస్టర్‌ శిష్యులు శేఖర్‌, జానీ మాస్టర్లు తమ గురువు కడసారి చూపుకోసం రాకేష్‌ మాస్టర్‌ ఇంటికొచ్చారు. ముందుగా శేఖర్‌ మాస్టర్‌ తన గురువు పార్థీవ దేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం నమస్కారం చేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఇక జానీ మాస్టర్‌ కూడా తన గురువును కడసారి చూసుకుని ఎమోషనల్‌ అయ్యారు. వీరితో పాటు నగరంలోని రాకేష్‌ మాస్టర్ అభిమానులందరూ ఆయన చివరి చూసు కోసం ఇంటికి చేరుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here