వాళ్ల టార్చర్‌ వల్లే అనుష్క సినిమాలు మానేసిందా?

- Advertisement -

అనుష్క శెట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్‌ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన అనుష్క తర్వాత వరుస సినిమాలు చేసి స్టార్‌ హీరోయిన్‌ హోదా సంపాదించుకుంది. సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా నటించే హీరోయిన్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆమె పేరే. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అనుష్క శెట్టి
అనుష్క శెట్టి

అయితే నిశ్శబ్దం తర్వాత ఆమె కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నది. గత కొంతకాలంగా సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. వెండితెరపై కనిపించి చాలా ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం అనుష్క చేతిలో ఒకే ఒక్క ప్రాజెక్టు ఉంది అదే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి అనుష్కకి జంటగా నటిస్తున్నారు.

దాదాపుగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. ఇంతకుముందు వరకు చేతిలో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండే అనుష్క ఇప్పుడు మాత్రం సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది.

- Advertisement -
Anushka shetty

దీని వెనక ఒక బలమైన కారణమే ఉందని అందరూ అనుకుంటూనే ఉన్నారు. అయితే కొందరు డైరెక్టర్లు పెట్టిన టార్చర్ వల్ల అనుష్క సినిమాలను చేయడం పూర్తిగా మానేసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి .ఇక బాహుబలి వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత భాగమతి, నిశ్శబ్దం వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది అనుష్క.

ఇలా వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడంతో ఆమెకి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందేమోనని ఓ స్టార్ డైరెక్టర్ ఆమెని లేడీ ఓరియంటెడ్ కథలతో తరచుగా ఇబ్బంది పెట్టేవాడని తెలుస్తోంది. పేరు ఉన్న దర్శకులు సైతం అనుష్కకి అలాంటి కథలే చెప్పడంతో ఆమె బాగా విసిగిపోయిందట. వారి టార్చర్ తట్టుకోలేక తర్వాత నుంచి కనీసం వారికి అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం లేదని సమాచారం. మరోవైపు అనుష్క శెట్టి పెళ్లి చేసుకునే ఆలోచనలోనే సినిమాలను పూర్తిగా తగ్గించేసిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here