Samantha: అందుకోసమేనా.!? సమంత మెట్ల పూజ చేసింది..?

- Advertisement -

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో ఆరోగ్య సమస్యలు వాటికి బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుండి సమంతా మాయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. తన ఆరోగ్యం కుదుటపడగానే వరుస సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. సమంత కి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. తాజాగా సమంత తమిళనాడులోని పలని మురుగన్ స్వామి దేవాలయాన్ని సందర్శించింది..

Samantha
Samantha

అరుళ్ ముగు శ్రీ దండాయుధపాణి స్వామి క్షేత్రం అని కూడా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించాలి అంటే 600 మెట్లు ఎక్కాలి. సమంత 600 మెట్లు ఎక్కడమే కాదు.. మెట్టు మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగింది. సమంత టీం తో పాటు జాను చిత్ర దర్శకుడు సి ప్రేమ్ కుమార్ కూడా సమంత దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకొన్నారు. సమంత కర్పూరం వెలిగిస్తూ మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

samantha Vists murugan temple
samantha Vists murugan temple

మయోసైటీస్ నుంచి కోల్కున్న తరువాత మెక్కు తీర్చుకునేందుకు సమంత ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. సమంత ఫోటోలో సింపుల్ గా సర్వార్ కమీజ్ ధరించి మాస్క్ పెట్టుకొని కనిపించింది. సమంత మెట్లు పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని సుబ్రహ్మణ్యస్వామికి సమంత ప్రత్యేక పూజలు నిర్వహించిందని సమాచారం.

- Advertisement -

సమంత నటించిన శకుంతలం సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమైంది. విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ లోనే సమంత పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సీటాడెల్ అనే వెబ్ సిరీస్ లోను నటిస్తోంది. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here