Samantha : సమంత మళ్లీ మొదలెట్టిందిగా.. ఈసారి ముంబయిలో

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ Samantha గత కొంతకాలం మయోసైటిస్ అనే వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. అయితే మొదట్లో ఈ విషయాన్ని సామ్ గోప్యంగా ఉంచి ట్రీట్‌మెంట్ తీసుకుంది. యశోద సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఈ వ్యాధితో బాధపడుతూనే షూటింగ్‌లో పాల్గొంది. ఈ విషయం ఆ చిత్రబృందానికి కూడా తెలియదు. అయితే సమంత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో సామ్‌కు ఏదో అయిందని సోషల్ మీడియాలో వార్తలు రావడం మొదలయ్యాయి. ఇక ఇదంతా చూసిన సామ్.. తనకున్న వ్యాధి గురించి తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

Samantha
Samantha

కొన్నిరోజులుగా తాను మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పింది. మయోసైటిస్‌ వ్యాధి కారణంగా సమంత చాలా నెలలుగా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది. యశోద సినిమాకు డబ్బింగ్ కూడా ఇంటి నుంచే చెప్పింది. ఇక యశోద మూవీ ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనలేదు. కానీ ఒక్క ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సామ్ తనకున్న వ్యాధి వల్ల పడిన ఇబ్బందులు తలుచుకుంటూ కంటతడి పెట్టింది. “ఒక్కొక్క రోజు ఇదే చివరిరోజు అనిపిస్తది.. ఇంకొక్క అడుగు కూడా వేయలేనేమో అనిపిస్తది.. కానీ ఇప్పుడు తలుచుకుంటే ఇంత దూరం ఎలా వచ్చానా అని ఆశ్చర్యమేస్తుంది అంటూ సామ్ ఏడ్చేసింది.

ఈ వ్యాధి వల్ల సమంత కెరీర్ ఎటువైపు పోతుందని చాలా మంది సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా కొన్ని బాలీవుడ్‌ ప్రాజెక్టుల నుంచి ఆమె వైదొలగనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె టీమ్ క్లారిటీ కూడా ఇచ్చింది. ‘‘సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె ‘ఖుషి’ షూటింగ్‌లో పాల్గొంటారు. అది పూర్తయిన వెంటనే ఇప్పటికే ఆమె ఓకే చేసిన బాలీవుడ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. జనవరి నుంచి సమంత ఒక హిందీ మూవీ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అది సాధ్యపడటం లేదు. బహుశా ఆ సినిమా షూటింగ్‌ మరో ఆర్నెల్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌, మే నుంచి ఆమె హిందీ మూవీ చిత్రీకరణలో పాల్గొనవచ్చు’’ అని సమంత ప్రతినిధి వివరించారు.

- Advertisement -
Samantha photos

అయితే ఇన్నాళ్లూ షూటింగ్ నుంచి విరామం తీసుకున్న సామ్ ఇటీవల ముంబయి ఎయిర్‌పోర్టులో దర్శమిచ్చింది. కొద్దిరోజుల క్రితం జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించింది. ఇక సామ్ షూటింగ్‌కు రెడీ అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే సమంత షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టింది. సమంత ప్రస్తుతం రాజ్‌-డీకే దర్శకత్వంలో ‘సిటాడెల్‌’వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్‌ ధావన్‌ కథానాయకుడు. ఈ వెబ్‌సిరీస్‌ చిత్రీకరణ కోసం వరుణ్‌తో కలిసి ముంబయిలోని సెట్లోకి అడుగు పెట్టింది సామ్‌. ఈ విషయాన్ని వరుణ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు.

ఇది హాలీవుడ్‌ షో ‘సిటాడెల్‌’కు రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో వరుణ్‌ ధావన్‌, సమంత గూఢచారి పాత్రల్లో కనిపించనున్నారు. ఇక సామ్‌, విజయ్‌ దేవరకొండ కలిసి నటిస్తున్న ‘ఖుషీ’ చిత్రం వచ్చే నెల నుంచి పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సమంత ఇప్పటికే డేట్లు కేటాయించిందని సమాచారం. మరోవైపు ఆమె నటించిన ‘శాకుంతలం’ వచ్చే నెల 17న విడుదల కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here