చిరంజీవి అంటే ఇష్టం అన్నందుకు ఆ చైల్డ్ ఆర్టిస్టుని మోహన్ బాబు అంతలా టార్చర్ చేశాడా?

- Advertisement -

Sahasra : చైల్డ్ ఆరిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నటి సహస్ర.రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, మేజర్ చంద్రకాంత్, సమరసింహా రెడ్డి ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి స్టార్ కిడ్ గా పేరు తెచ్చుకుంది.ముఖ్యంగా సమరసింహా రెడ్డి చిత్రం లో కాళ్ళు లేని అమ్మాయిగా బాలకృష్ణ చివరి చెల్లెలుగా ఎంతో అద్భుతమైన నటన కనబర్చింది.ఈమెని చూసిన వెంటనే ఎవరికైనా ‘సమరసింహా రెడ్డి’ సినిమానే గుర్తుకు వస్తుంది.

Sahasra
Sahasra

ఈ సినిమాతో పాటుగా మేజర్ చంద్రకాంత్ కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే ఆమె ‘సమరసింహా రెడ్డి’ సినిమా తర్వాత సినిమాలు చెయ్యడం మానేసింది. పై చదువులు చదువుకొని, బిజినెస్ రంగం లో గొప్పగా రాణిస్తూ ముందుకు దూసుకుపోతుంది.అయితే రీసెంట్ గా ఈమె పలు యూట్యూబ్ చానెల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Samarasimha reddy

ఎంత మంది హీరోలతో పనిచేసిన నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అని అప్పట్లో ఈమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పిందట. కేవలం చిరంజీవి మాత్రమే ఇష్టమని, మిగిలిన హీరోలు ఇష్టం లేదని చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే అప్పుడే ఈమె మోహన్ బాబు ‘మేజర్ చంద్ర కాంత్’ చిత్రంలో బాలనటిగా నటిస్తూ ఉంది.

- Advertisement -
MOhan babu chiranjeevi

మోహన్ బాబు ఆమె మాట్లాడిన మాటలు ఒక దిన పత్రిక ద్వారా చూశాడట. వెంటనే కోపం తో ఆ పేపర్ ని నేలకేసి కొట్టి ‘నా సినిమాలో పనిచేస్తూ, కేవలం చిరంజీవి మాత్రమే ఇష్టం, ఇంకెవ్వరు ఇష్టం లేదని చెప్తావా. అంటే నీ దృష్టిలో మిగిలిన వాళ్ళు హీరోలు కాదా’ అని కోపం తో అరిచాడట. అప్పుడు శ్రేష్ఠ ‘నేను అలా చెప్పలేదు సార్.. నేను చెప్పింది ఒకటైతే అక్కడ రాసింది మరొకటి’ అని చెప్పిందట . నువ్వు చెప్పకపోతే వాళ్ళు ఎందుకు అలా రాస్తారు, అబద్దాలు చెప్పకు అని మోహన్ బాబు అన్నాడట. ఈ సంఘటన జరిగిన తర్వాత మోహన్ బాబు సహస్రతో పెద్దగా మాట్లాడింది లేదట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here