Veera Simha Reddy సినిమాలో ‘జై బాలయ్య’ పాట అందుకే పెట్టారట

- Advertisement -

నందమూరి బాలకృష్ణ నటించిన Veera Simha Reddy సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలయ్య స్టైల్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పంచకట్టులోనూ బాలకృష్ణ స్టైలిష్ గా కనిపించారు. 

Veera Simha Reddy
Veera Simha Reddy

ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో విజయోత్సవంలో ఫుల్ బిజీగా ఉన్నారు సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ ఈ మూవీలో బాలయ్య స్టైలింగ్, జై బాలయ్య పాట ఎందుకు పెట్టారో చెప్పారు.

” జై బాలయ్య డైలాగ్​ ఓ ట్రెండ్ అయిపోయింది. అందుకే ఆ డైలాగ్ పెట్టాను. జై బాలయ్య పాట విషయానికొస్తే.. ఆ పదం ఓ ఎమోషన్​ అయిపోయింది. అందుకే ఆ పాట ఉంటే ఓ మ్యాజిక్ క్రియేట్​ అవుతుంది నేను తమన్ అనుకున్నాం. అందుకే​ చేశాం. అది వర్కౌట్ అయింది. ప్రేక్షకుల్ని ఆదరిస్తారని అనుకున్నాం. ఆదరించారు.” అని గోపిచంద్​ అన్నారు.

- Advertisement -

“అటు మాస్​ థియేటర్​లో ఇటు​ మల్టీప్లెక్స్​లో సినిమా చూశాను. మాస్​తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా​ బాగా కనెక్ట్ అయ్యారు. అసాధారణమైన రెస్పాన్స్ వచ్చింది. నా ఫోన్లు ఇప్పటివరకు మోగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్స్ చేశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాగా చూపించావని అంటున్నారు. బాలయ్య కాస్ట్యూమ్స్​ విషయానికొస్తే ఆయన క్యారెక్టర్​కు బాగా డెప్త్​ ఉంటుంది. డిజైన్​ చేసేటప్పుడే స్కెచెస్​ వేయించాను. ఆ తర్వాత బాల్యయకు అది చూపించాను. అయితే మొదట నా మనసులో బ్లాక్​ షర్ట్​ వేద్దాం అన్నప్పుడు బాలయ్యను అడగలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ అప్పుడే బాలయ్య కూడా తమ మనసులో బ్లాక్ ఉందని చెప్పారు. దీంతో నేను కూడా అదే అనుకున్నా సార్​ అంటూ డిజైన్ చూపించాను. ఇక యంగ్ లుక్ బాలయ్య కోసం భాస్కర్​ డిజైనర్​. ఆయన ప్రభాస్​కు పర్సనల్​ డిజైనర్​.” అని గోపిచంద్​ అన్నారు.

వీరసింహారెడ్డి సినిమా విషయానికొస్తే.. మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రోర్​ మాములుగా లేదంటున్నారు అభిమానులు. జై బాలయ్య అన్న నినాదంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయనే చెప్పాలి. ఇక బాలయ్య అటు యాక్షన్​తో పాట ఇటు సెంటిమెంట్​ను బ్యాలెన్స్​ చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.​ ఈ సినిమాలో నటించిన ఇతర తారలు దునియా విజయ్​, వరలక్ష్మీ శరత్​కుమార్​, శ్రుతిహాసన్​, హనీ రోజ్​ సైతం తమదైన శైలిలో నటించి సీన్స్​ పండించారు. ఇప్పటివరకు విడుదలైన రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా రూ.119 కోట్ల గ్రాస్​ సాధించినట్లు ట్రేడ్​ వర్గాల సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here