Rashmika Mandanna : నీయమ్మా అంటూ లైవ్ లోనే బూతులు తిట్టిన రష్మిక.. అసలు కారణమిదే..

- Advertisement -

Rashmika Mandanna : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన తెలంగాణా యాస, తెలంగాణ కల్చరే కనిపిస్తోంది. ఒకప్పుడు సినిమాల్లో ఈ స్లాంగ్‌ ఎక్కువగా కనిపించేది కాదు. ప్రత్యేకించి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమాల్లో తప్ప తెలంగాణ యాస ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. కానీ కొంత కాలం నుంచి ప్రతీ సినిమాలో తెలంగాణ యాస ఖచ్చితంగా కనిపిస్తోంది. విలన్స్, కమెడియన్స్ మాత్రమే కాదు.. హీరోలే తెలంగాణ యాస మాట్లాడి అదరగొడుతున్నారు.

Rashmika Mandanna
Rashmika Mandanna

నార్మల్‌గా చెప్పే పంచ్‌ డైలాగ్స్‌ కంటే తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇప్పుడు ఆ యాసకు ఉన్న క్రేజ్‌ అది. రీసెంట్‌గా హీరోయిన్‌ రష్మిక మందన కూడా తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడి అదరగొట్టింది. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌ చాట్‌ చేసిన రష్మికను.. కొందరు ఫ్యాన్స్ తెలంగాణ యాసలో మాట్లాడాలంటూ కోరారు. తెలంగాణలో మీకు ఫ్రెండ్‌ ఉంటే ఎలా మాట్లాడతారు ఒకసారి మాట్లాడండి అంటూ అడిగారు. ఫ్యాన్స్‌ అడిగి వెంటనే నమస్తే ఎట్లున్నరు అంటూ తెలంగాణ యాసలో మాట్లాడింది రష్మిక. ఇక ఇందులోనే నీయమ్మా అని అన్నడంతో నెటిజన్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

రష్మిక

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ఫుల్ వైరల్‌ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్.. అద్భుతంగా మాట్లాడారంటూ కామెంట్లు చేస్తన్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప ది రూల్లో చేస్తోంది. ఇక బాలీవుడ్లో రన్బీర్ కపూర్, సందీప్ వంగ కాంబోలో వస్తున్న యానిమల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here