Allu Arjun: టీడీపీ నేత ఫార్మ్ హౌస్ లో అల్లు అర్జున్.. అందుకోసమేనా?

- Advertisement -

Allu Arjun పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలితో, సన్నిహితులతో టైం స్పెండ్ చేస్తుంటారు.. తాజాగా బన్నీ ఓ టీడీపీ నేత ఫార్మ్ హౌస్ కు వెళ్లడం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. రాయలసీమకు చెందిన ఓ టీడీపీ నేత ఆతిధ్యాన్ని అల్లు అర్జున్ స్వీకరించారు. ఆయన ఫార్మ్ హౌస్ లో సందడి చేశారు.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి..

Allu Arjun
Allu Arjun

రాయలసీమ వంటకాలను ఆరగించాడు. ఇది టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ స్నేహితులతో హైదరాబాద్ నుండి బెంగుళూరు కారులో వెళుతున్నారు. ఆయన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో గల కనుంపల్లి వద్ద ఆగారు. స్థానిక టీడీపీ నేత మంటిమడుగు కేశవరెడ్డి అల్లు అర్జున్ ని ఇంటికి ఆహ్వానించారు..అల్లు అర్జున్ కి రాయలసీమ వంటకాలతో ప్రత్యేక భోజనం పెట్టారు. కేశవ రెడ్డి కొడుకు రాహుల్ రెడ్డి పక్కనే ఉన్నాడు. కేశవరెడ్డి కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ కాసేపు ముచ్చటించారు. అలాగే కేశవ రెడ్డి ఫార్మ్ హౌస్ ని సందర్శించారు. అనంతంర ఫోటోలకు ఫోజిచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

అనుకోకుండా కలిసిన, వీరి మీటింగ్ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేకున్నప్పటికీ ప్రాధాన్యత సంతరించుకుంది.మరోవైపు పుష్ప 2 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వచ్చే ఏడాది సమ్మర్ లో పుష్ప 2 విడుదలయ్యే అవకాశం కలదు. దేశవ్యాప్తంగా పుష్ప 2 పై భారీ హైప్ నెలకొంది. వెయ్యి కోట్ల వసూళ్ల టార్గెట్ తో బరిలో దిగుతున్నట్లు సమాచారం.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.. మరి పుష్ప 2 ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here