అలాంటి వాళ్ళు పోయినా పట్టించుకోను.. రష్మీ గౌతమ్

- Advertisement -

తెలుగు బుల్లితెర యాంకర్ గా తన అందంతో నటనతో యువతను ఆకర్షిస్తున్న యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతోనే కాదు అందంతో కూడా ఆకట్టుకుంటున్న ఈమె వచ్చి రాని తెలుగుతో ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని చాటుకున్న రష్మీ ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడిందో అందరికీ తెలిసిందే. ఇక తండ్రి తమను దూరం పెట్టినా తల్లితో జీవితాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు స్టార్ యాంకర్ గా కొనసాగుతోంది. అంతేకాదు బుల్లితెర యాంకర్లలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న యాంకర్ గా కూడా చలామణి అవుతోంది.

రష్మీ గౌతమ్

మరొకవైపు సమాజంలో జరిగే అన్యాయాలపై కూడా స్పందిస్తూ తనదైన శైలిలో అందరినీ అలరిస్తూ ఉండే ఈమె అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి చాలా గ్రాండ్గా జరుపుకుంది.ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా వాటిని చూసిన కొంతమంది పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పాజిటివ్గా కామెంట్లు చేస్తుంటే మరి కొంతమంది రష్మీ గౌతమ్ ను ఎగతాళి చేసే విధంగా నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారు.

rashmi gautam

ఇక ఈ విషయంపై ఆమె స్పందిస్తూ నెగిటివ్గా కామెంట్ పెట్టే వాళ్ళకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. ఒక లాంగ్ నోట్ రిలీజ్ చేసింది రష్మీ.. నాతో ఉండేవాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు పోతారు అలాగని నాపై నెగటివ్ కామెంట్స్ చేసే వారు పోయినా పట్టించుకోను.. వయసు మరో ఏడాది పెరిగింది. పుట్టినరోజులు ఇంత అద్భుతంగా మార్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలిపింది రష్మి గౌతమ్ ఇకపోతే రష్మి చేసిన ఈ కామెంట్లో ఇప్పుడు అందరిని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here