IPL ఫైనల్స్ మ్యాచ్ కి అహ్మదాబాద్ కి రాబోతున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

- Advertisement -

ఈ సీజన్ IPL మ్యాచులు అన్నీ ఎంత ఆసక్తికరంగా సాగాయో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్ లోని టోర్నమెంట్ మ్యాచులన్నీ పూర్తి అయ్యి, ప్లే ఆఫ్స్ స్టేజి కి వచ్చింది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన క్వాలిఫైర్ 1 మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ టీం 15 పరుగుల తేడా తో గుజరాత్ టైటాన్స్ మీద గెలుపొంది నేరుగా ఫైనల్స్ కి వెళ్ళిపోయింది.

ఈ ఆదివారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం తో ఎవరు తలపడబోతున్న అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అహ్మదాబాద్ లో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విచ్చేయబోతున్నట్టు సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

రామ్ చరణ్ కి మొదటి నుండి క్రికెట్ అంటే ఇష్టం అనే సంగతి తెలిసిందే, ముఖ్యంగా IPL మ్యాచులు వచ్చినప్పుడు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తూ ఉంటాడు. ఇక రీసెంట్ గా ఆయన ఒక IPL టీం ని కొనబోతున్నట్టు కూడా సోషల్ మీడియా లో ఒక వార్త విస్తృతంగా ప్రచారమైన సంగతి తెలిసిందే. ఇందులో ఎంత నిజం ఉంది అనేది ప్రస్తుతానికి తెలియదు. రామ్ చరణ్ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చేంత వరకు ఈ వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది.

- Advertisement -

అయితే ఈ ఆదివారం ఆయన అహ్మదాబాద్ లో జరగబోయే మ్యాచుకు హాజరు కాబోతున్నాడు అనే వార్తలు వస్తుండడం తో రామ్ చరణ్ నిజంగానే IPL టీం కొనబోతున్నాడా అనే సందేహం ప్రతీ అభిమాని లోనూ కలిగింది. ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పటి వరకు ఇన్నాళ్లు జరిగిన ఒక్క IPL మ్యాచుకు కూడా హాజరు కాలేదు, అలాంటిది మొట్టమొదటి సారి ఫైనల్ మ్యాచ్ కి వస్తుండడం తో ఆయన IPL టీం కొనబోతున్నాడు అనే వార్త మరింత బలపడింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here