Ram Charan కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అప్పోయింట్మెంట్ దొరకలేదా..? సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోలింగ్స్

- Advertisement -

Ram Charan ఇండియా కి తిరిగిరాగానే ఢిల్లీ కి చేరుకొని ‘ఇండియా టుడే కాంక్లేవ్’ మీటింగ్ లో పాల్గొన్నాడు.ఈ మీటింగ్ లో ఆయన భవిష్యత్తులో చెయ్యబొయ్యే ప్రాజెక్ట్స్ గురించి, అలాగే #RRR మూవీ చేస్తున్న సమయం లో తనకి ఎదురైన అనుభవం గురించి, జూనియర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి తో తనకి ఏర్పడిన అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు.అవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Ram Charan
Ram Charan

ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి తో కలిసి మన దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా మర్యాదపూర్వకంగా కలిశారు.నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు గెలిచినందుకు గాను రామ్ చరణ్ కి అభినందనలు తెలిపి షాల్వా కప్పాడు అమిత్ షా.దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

shaw

అయితే రామ్ చరణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కూడా కలవబోతున్నట్టు వార్తలు వచ్చాయి.మీడియా చానెల్స్ కూడా బ్రేకింగ్ న్యూస్ గా చెప్పుకొచ్చింది, కానీ కేవలం అమిత్ షా ని మాత్రమే కలిసి రావడం, మోడీ అప్పోయింట్మెంట్ దొరకకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.అయితే రామ్ చరణ్ కలవాలనుకున్నది కేవలం అమిత్ షా ని మాత్రమే, నరేంద్ర మోడీ ని కలుస్తున్నట్టు ఎవరో మీడియా కి తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ అభిమానులు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

- Advertisement -
modi

కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయం పై సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ల్స్ చేస్తున్నారు రామ్ చరణ్ పై.ఎందుకంటే ప్రధాన మంత్రి మోడీ ని కలుస్తునట్టు బాగా ప్రచారం అయ్యింది, చివరికి కలవకపొయ్యేసరికి వాళ్ళు రామ్ చరణ్ ని వెక్కిరించడం ప్రారంభించారు.గత కొంతకాలం గా సోషల్ మీడియా లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి.అందులో భాగంగానే ఈ అంశం పై కూడా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి.

ram
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here