అలాంటి వాళ్ళని చంపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ Poonam Kaur

- Advertisement -

Poonam Kaur సినిమాల్లో అవకాశాలు లేని కొంతమంది హీరోయిన్స్ మరియు క్యారక్టర్ ఆర్టిస్ట్స్ సోషల్ మీడియా ని ఆయుధం గా చేసుకొని కాంట్రోవర్సియల్ కామెంట్స్ చేస్తూ పాపులారిటీ ని సంపాదించాలనుకుంటారు.అలాంటి వారిలో ఒకరు పూనమ్ కౌర్.ఈమె గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది, సోషల్ మీడియా వాడే ప్రతీ ఒక్కరికి తెలుసు.ఎప్పుడు వివాదాలతో సావాసం చేస్తూ ఉంటుంది.సినిమాల్లో పెద్ద హీరోయిన్ అవ్వాలనే కలతో వచ్చిన ఈమెకి హీరోయిన్ అవకాశాలు మాత్రం రాలేదు.

Poonam Kaur
Poonam Kaur

హీరోయిన్ పక్కన స్నేహితురాలి పాత్రలు మరియు హీరోకి చెల్లెలు పాత్రలు ఇలా ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ మాత్రమే వచ్చాయి, అందుకు ఆమెలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ని ఆమె మతాల ద్వారానే మనం గమనించొచ్చు.రీసెంట్ గా ఈమె టాలీవుడ్ మీద మరోసారి సంచలన కామెంట్స్ చేసింది.ఆమె మాట్లాడుతూ ‘నాకు తెలుగు లో సినిమాలు చేయాలనుంది,కానీ ఇక్కడోళ్లకు ముంబై హీరోయిన్లే నచ్చుతారు.సావిత్రి, సౌందర్య గార్ల గురించి అంత గొప్పగా మాట్లాడుతారు, కానీ అవకాశాలు మాత్రం తెలుగు వాళ్లకి ఇవ్వరు’ అంటూ చెప్పుకొచ్చింది.

Poonam

ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఆమె ప్రీతీ అనే అమ్మాయి ఆత్మ హత్య చేసుకోగా, ఆమె అమ్మానాన్నలను పరామర్శించడానికి వెళ్ళింది.అక్కడికి వచ్చిన మీడియా తో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.ఆమె మాట్లాడుతూ ‘ఏ అమ్మాయికి అయినా ఆత్మహత్య చేసుకునే పరిస్థితే వస్తే, మీరు చావొద్దు, మిమల్ని మోసం చేసినవాళ్ళని చంపేయండి.ప్రీతీ వాళ్ళ అమ్మా నాన్న ఏడుస్తూ ఉండడం చూసి చాలా బాధవేసింది,గురు గోవింద్ జీ ఒకటి ఎప్పుడు చెప్తూ ఉంటాడు, శాంతి కోసం మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా దక్కనప్పుడు, మిమల్ని బాధించేవారు ఇంకా మీపై రెట్టింపు వత్తిడిని తెచ్చే వాళ్ళు ఉన్నప్పుడు, ఇక వీళ్ళు ఉన్నంత వరకు శాంతి అసాధ్యం అని మీకు అనిపించినప్పుడు వాళ్ళని ఈ లోకం నుండి తరిమేయండి అని చెప్పాడు..మీరు అదే ఫాలో అవ్వండి’ అంటూ పూనమ్ కౌర్ ఈ సందర్భంగా మాట్లాడింది.

Kaur
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here