చేతులారా పాన్ ఇండియా సినిమాను వదులుకున్న సాయిపల్లవి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

- Advertisement -

తమిళ చిత్రం ప్రేమమ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సాయిపల్లవి. ఆ సినిమాలో ఆమె నటన చూసి ముగ్థుడైన శేఖర్ కమ్ముల తన ఫిదా చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఆ సినిమాలో న్యాచురల్ నటన చూసి అమ్మడికి న్యాచురల్ బ్యూటీ బిరుదు పడిపోయింది. ఎక్స్ పోజింగ్ కు దూరంగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను సెలక్టివ్ గా చేసుకుంటూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఎందుకో అమ్మడి జోరు తగ్గింది. గతేడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి సాయి పల్లవి ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోవడం లేదు. తాజా అమ్మడుకు ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేతుల దాకా వస్తే వదిలేసుకుని అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది. రజనీ కాంత్ అల్లుడు ధనుష్ తెలుగులో నేరుగా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలసిందే. సార్ వంటి సూప‌ర్ హిట్ తర్వాత ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు. తన కెరీర్లో ఇది 51వ సినిమా. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సాయిపల్లవి
సాయిపల్లవి

ఇందులో పుష్ప ఫేమ్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‎గా ఎంపిక అయిందని వార్తలు వచ్చాయి. వాస్తవానికి క్లాసిక్ చిత్రాల దర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల సాయి ప‌ల్లవిని తన తదుపరి సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని భావించారట. అంతకు ముందు వీరి కాంబోలో ఫిదా, లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. పైగా గ‌తంలో ధ‌నుష్, సాయి ప‌ల్లవి జంటగా మారి 2సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. అందుకే D51 కోసం సాయి ప‌ల్లవిని శేఖ‌ర్ క‌మ్ముల అప్రోచ్ అయ్యారట. కానీ, ఎందుకో గానీ తను సినిమాలో చేసేందుకు నో చెప్పిందని టాక్. దాంతో శేఖర్.. ర‌ష్మిక‌ను సినిమా కోసం సెలక్ట్ చేశారట. నిజానికి శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల్లో హీరోయిన్లకు చాలా ప్రాధాన్యత కల్పిస్తారు. ఈ విషయం సాయిపల్లవి తన గత రెండు సినిమాల్లో చూసింది కూడా. నిజానికి తను కూడా అలాంటి పాత్రలంటేనే ఇష్టపడుతుంది. అయినా ఈ సారి శేఖ‌ర్ క‌మ్ముల‌-ధ‌నుష్ మూవీని వదులుకుంది. దీంతో సాయి ప‌ల్లవికి మైండ్ దొబ్బిందా.. అంటూ నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here