సాయి ధ‌ర‌మ్ తేజ్‌- సాయి ప‌ల్లవి కాంబోలో మిస్సయిన హిట్ మూవీ ఏంటో తెలుసా?

- Advertisement -

ఫిదా సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది సాయిపల్లవి. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ బబ్లీ బబ్లీగా కవ్విస్తూ నటనలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది సాయిపల్లవి. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. అందరి హీరోయిన్ల కంటే భిన్నంగా ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్స్, స్కిన్ షో లాంటి వాటికి దూరంగా ఉంటుంది. అలాంటివి చేయనని తనను సంప్రదించిన దర్శకనిర్మాతలకు ముందుగానే చెప్పేస్తుంది. అయినా తన నటనగురించి తెలిసి ఆమెను తీసుకునేందుకు వారు వెనకాడరు. కొంతమందికి ఆమె కండీషన్లు నచ్చకపోయేవి. అలా చాలా పెద్ద సినిమాలను తను వదులుకోవాల్సి వచ్చింది. అందులో కొన్ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు అయ్యాయి.

సాయి ప‌ల్లవి
సాయి ప‌ల్లవి

ఈ క్రమంలో మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, సాయి ప‌ల్లవి కాంబోలో కూడా ఓ సూపర్ హిట్ మిస్సయింది. అది మరే సినిమానో కాదు..కలెక్షన్ల సునామీ సృష్టించిన విరూపాక్ష. ఏప్రిల్ లో విడుద‌లైన ఈ చిత్రం వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే హయ్యాస్ట్ గ్రాసర్ మూవీ ఇది. ఈ సినిమాను కార్తీక్ దండు తెరకెక్కించాడు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో సంయుక్త పాత్ర ఎంత‌లా హైలెట్ అయిందో అందరికీ తెలిసిందే.

ఈ హర్రర్ థ్రిల్లర్ సినిమాలో సంయుక్త కంటే ముందు సినిమా యూనిట్ సాయిపల్లవిని సంప్రదించారట. అయితే సాయి ప‌ల్లవి ఇలాంటి పాత్రలకు నో చెప్పదు. దీనికి లెక్కల మాస్టార్ సుకుమార్ అడ్డు చెప్పాడట. సాయి ధ‌ర‌మ్ తేజ్ తో పోలిస్తే సాయి పల్లవికే క్రేజ్ ఉంది. సాయిపల్లవితో నటిస్తే సాయి ధరమ్ తేజ్ పై డామినేషన్ చేస్తుందని సుకుమార్ చెప్పాడట. దాంతో డైరెక్టర్ మనసు మార్చుకుని సంయుక్తను హీరోయిన్ గా ఓకే చేశారట. అలా వారి కాంబోలో విరూపాక్ష మిస్ అయింది. నిజానికి సాయిపల్లవి నటిస్తే సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉండేదో?

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here