నేతాజీ మిస్టరీ నేపథ్యంలో నిఖిల్ స్పై టీజర్.. యాక్షన్ సీన్స్ హైలెట్..

- Advertisement -

టాలీవుడ్‌ యంగ్ హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రస్తుతం నటిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ స్పై.. న్యూఢిల్లీలోని ఐకానిక్ ల్యాండ్‌మార్క్ కర్తవ్య పథ్ (రాజ్‌పథ్)లో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద స్పై టీజర్‌ను ఆవిష్కరించారు… ఢిల్లీలోని కర్తవ్య పథ్ నేతాజీ స్టాట్యూ వద్ద లాంచ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ సబ్జెక్టు ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో టీజర్ లాంచ్ కి కర్తవ్య పథ్ ని ఎంచుకున్నట్లు నిఖిల్ అన్నారు..

స్పై టీజర్
స్పై టీజర్

ఒకటిన్నర నిమిషాల నిడివి కలిగిన టీజర్ ఆకట్టుకుంది. యాక్షన్, సస్పెన్సు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సాగింది. టీజర్ లో కథపై హింట్ ఇచ్చేశారు. 1945లో కనపడకుండా పోయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చుట్టూ స్పై మూవీ నడుస్తుంది. చంద్రబోస్ మరణం పెద్ద మిస్టరీ. అనేక వాదనలు వినిపించాయి. నిజం ఏమిటనేది ఎవరికీ తెలియదు. ఇండియన్ గవర్నమెంట్ కి తెలిసినా బయటపెట్టలేదనే మరో వాదన కూడా ఉంది. ఈ సబ్జెక్టు పై తెలుగులో చిత్రాలు వచ్చిన దాఖలాలు లేవు.

సినిమాలో మాత్రం ఆయన ఎందుకు చనిపోయారు అనేది ఇందులో చూపిస్తారు..ఫైనల్ గా హీరోకి తెలిసిన నిజం ఏమిటీ. వాస్తవాలు తెలుసుకునే క్రమంలో హీరో పడ్డ కష్టాల సమాహారమే స్పై మూవీ. గ్యారీ బి హెచ్ ఈ చిత్ర దర్శకుడు. ఈ మల్టీ టాలెంటెడ్ ఫెలో దర్శకుడిగా భారీ స్పై థ్రిల్లర్ చేస్తున్నారు. మకరంద్ దేశ్ పాండే కీలక రోల్ చేశారు. జూన్ 29న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఐశ్వర్య మీనన్ నిఖిల్ కి జంటగా నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకల, విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here