Niharika : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ స్టార్టింగులో యాంకర్గా బుల్లితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు వీరిద్దరి కాపురం బాగానే కొనసాగింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు బతుకుతున్నారు. ఇక అప్పటి నుంచి నిహారిక సినిమాలు, వెబ్సిరీస్లు తీస్తుంది. చైతన్య కూడా తన లైఫ్లో తను బిజీ అయిపోయాడు. అయితే ఇటీవల నిహారిక తనకు పిల్లలంటే ఇష్టం.. పిల్లలను కనాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. రెండో పెళ్లి అయితే చేసుకుంటాను. కానీ అది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా.. జొన్నలగడ్డ చైతన్య ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సైలెంట్గా ఉన్న ఆయన ఒక్క సారిగా యాక్టివ్ అయి తన ఇన్స్టాగ్రామ్లో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ‘‘విశాలమైన అంతరిక్షంలో నిశ్శబ్దం. నీటి అడుగున ఉన్నప్పుడు అనుభవించే నిశ్శబ్దం, చల్లని శీతాకాలపు రాత్రి ఆవరించే నిశ్శబ్దం, చప్పట్లు కొట్టే ముందు ప్రదర్శన ముగింపులో ఉండే నిశ్శబ్దం. మీ హృదయాన్ని బద్దలు కొట్టే విషయం వినేటప్పుడు వచ్చే నిశ్శబ్దం. జీవితం మిమ్మల్ని ముంచెత్తినప్పుడు మీ ఆలోచనలో మీరు కోరుకునే నిశ్శబ్దం. మీ ప్రాణశక్తిని ప్రకృతి శక్తి నుండి వేరు చేస్తుంది. భౌతిక రూపం నుంచి విముక్తి పొందండి. ఇదే మౌనం భగవంతుడితో కలిపే మాధ్యమం’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు ఈ పోస్ట్ నిహారిక రెండో పెళ్లి చేసుకుంటాననగానే చైతన్య తట్టుకోలేకనే చేశాడని భావిస్తున్నారు. అంతేకాకుండా మాజీ భార్యను మర్చిపోలేక ఇండైరెక్ట్గా ఇలా చెప్పుకొచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు.