Samantha : అవన్నీ తట్టుకోలేకపోయా.. అందుకే బయట పెట్టాల్సి వచ్చిందంటున్న సమంత

- Advertisement -

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇటీవల మయోసైటీస్ వ్యాధి తగ్గడంతో మళ్లీ యాక్టివ్ అవుతుంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను నిరంతరం తన అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. ప్రస్తుతం పలు రకాల ఈవెంట్స్‌కు హాజరవుతూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

samantha
samantha

తాజాగా, ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో సమంత పాల్గొంది. ఆ సమయంలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ప్రతిరోజు నేను 10 రకాలు పనులు చేస్తాను. ఐదు గంటల సమయం మాత్రమే నిద్రపోతాను. నా కెరీర్‌లో కొన్ని బాధపడిన సంవత్సరాలు ఉన్నాయి. దానివల్ల సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఆస్వాదించలేక పోయాను. సక్సెస్ సాధించినప్పటికీ నా వల్ల వచ్చింది కాదనే భ్రమలో ఉండేదానిని. నటిగా ఇప్పటికి దాదాపు 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. అయితే నేను లేడీ ఓరియెంటెడ్‌గా నటించిన యశోద సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయాను.

- Advertisement -

ఆ సమయంలో చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ తట్టుకోలేకపోయా.. తప్పనిసరి పరిస్థితుల్లో నా వ్యాధి గురించి బయటపెట్టక తప్పలేదు. అంతే కానీ మరేమి లేదు. అలాగే యశోద సినిమా నిర్మాత నువ్వు ప్రమోషన్స్ చేయకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని అనడంతో ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తర్వాత ట్రీట్‌మెంట్ కోసం ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా, సమంత, తమిళ హీరో విజయ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దాంతో పాటు త్వరలోనే సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here