ఎరుపు బికినీలో ఐస్ వాటర్లో ‘చిరుత’ భామ అందాల రచ్చ మామూలుగా లేదు

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’లో హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. 2007 లో విడుదలైన ఈ మూవీ మిక్స్​ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నటించిన తర్వాత అమ్మడి అందచందాలు బాగానే మార్కులు పడ్డాయి. హాలీవుడ్ హీరోయిన్ ఎంజెలినా జోలిలా ఉందంటూ పలువురు కితాబు ఇచ్చారు. ఈ మూవీ తర్వాత వరుణ్ సందేశ్ తో ‘కుర్రాడు’ అనే మూవీ తీసింది. ఇది కూడా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. సరైన సక్సెస్ రాకపోవడంతో అమ్మడికి అవకాశాలు కరువైయ్యాయి. దీంతో అమ్మడు టాలీవుడ్ కు టాటా చెప్పి బాలీవుడ్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే 2010 లో ‘క్రూక్’ అనే సినిమాలో నటించింది. అక్కడ పర్వాలేదనిపించుకుంది. దీంతో వరుస సినిమాలు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయింది. హిందీలోనే నేహా శర్మ ఎక్కువ సినిమాలు చేసింది.

నేహా శర్మ
నేహా శర్మ

చేసింది రెండు సినిమాలే అయినా అమ్మడిని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. తెలుగు ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా ఎల్లపుడూ టచ్ లోనే ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటో, వీడియోలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేహా శర్మ తన బోల్డ్ ఫిగర్‌తో మరోసారి విధ్వంసం సృష్టించింది. నేహా శర్మ ఎర్రటి మోనోకిని ధరించి మంచు నీటిలో స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అభిమానులు అమెను చూస్తూ చూపుతిప్పుకోలేకపోతున్నారు. నేహా బికినీలో అంత అందంగా ఉంది మరి. ఇంకా ఇన్నేళ్ల తర్వాత నేహా శర్మకు సంబంధించిన మరోవార్త వైరల్ అవుతోంది. నేహా వరుస సినిమాలతో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ – రవితేజ ముళ్ళపూడి కాంబోలో వస్తున్న సినిమాలో నేహా శర్మ ఓ కీలక పాత్రలో కనిపించనుందట. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here