Chiranjeevi : సెట్స్ మీద ఉన్న సినిమాలన్నీ క్యాన్సిల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. సంచలన ప్రకటన చేయబోతున్నాడా?

- Advertisement -

Chiranjeevi : ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నుండి రెండు సినిమాలు విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. అందులో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించి 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత రీసెంట్ గా విడుదలైన ‘భోళా శంకర్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చి మెగాస్టార్ చిరంజీవి పరువు తీసేసింది.

Chiranjeevi
Chiranjeevi

ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. చాలా సెంటర్స్ లో 20 ఏళ్ళ క్రితం విడుదలైన డిజాస్టర్ ‘మృగరాజు’ చిత్రం కలెక్షన్స్ ని కూడా దాటలేకపోయింది. ఈ సినిమా ఫలితం తో చిరంజీవి లో చాలా మార్పు వచ్చింది. ఇక నుండి రీమేక్ సినిమాలను చేయబోనని తన వద్దకి రీమేక్ సబ్జక్ట్స్ తో వచ్చిన దర్శకనిర్మాతలను వెనక్కి పంపేస్తున్నాడట.

ప్రస్తుతం చిరంజీవి ‘భింబిసారా’ మూవీ డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యం లో తెరకెక్కుతుంది. ఇందులో ఏకంగా నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ తెరకెక్కించే ఈ సినిమా నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి,ఈ సినిమాకి ఆయన కూతురు సుస్మిత నిర్మాత.

- Advertisement -

ఈ చిత్రం తో పాటుగా ఆయన మలయాళం టాప్ డైరెక్టర్ తో ఒక సినిమా, అలాగే జైలర్ దర్శకుడు నెల్సన్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు అంటూ చాలా కాలం నుండి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని పక్కన పెట్టేసినట్టు సమాచారం. ముందుగా తన పూర్తి స్థాయి ద్రుష్టి ఇప్పుడు వసిష్ఠ తో తియ్యబోయే సినిమా మీదనే ఉంచబోతున్నట్టు సమాచారం. అంతే కాకుండా చిరంజీవి 70 ఏళ్ళ వయస్సు కి చేరుకోగానే నటనకి స్వస్తి చెప్పి దర్శకత్వం వైపు అడుగులు వెయ్యాలని చూస్తున్నాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here