Meerajasmin : మీరాజాస్మిన్ ఇంట ఎవరూ ఊహించని విషాదం.. ఎప్పటికి కోలుకుంటుందో..!

- Advertisement -

మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ ఈరోజు కొచ్చిలో కన్నుమూశారు. ఆయన మరణానికి కారణం వృద్ధాప్య సమస్యలు అని తెలుస్తోంది. ఆయనకు ఇప్పుడు 83 ఏళ్లు. వృద్ధాప్య కారణాలతో అస్వస్థతకు గురై ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఆయనకు భార్య ఏలియమ్మ జోసెఫ్ తో పాటు పిల్లలు మీరా, జిబి సారా జోసెఫ్, జెని సారా జోసెఫ్, జార్జ్, జాయ్ కూడా ఉన్నారు.

ఇక చాలా గ్యాప్ తర్వాత మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. కానీ మీరా తన నటనా జీవితంలో, తన నటనా జీవితంలో లేదా తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడా తన కుటుంబం గురించి లేదా తల్లిదండ్రుల గురించి మాట్లాడలేదు. సినిమాలకు అతీతంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరూ ఇంకేమీ తెలుసుకోవాలనుకోలేదని మీరా జాస్మిన్ అభిప్రాయపడింది. ముందుగా 2001 వ సంవత్సరంలో మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఆమె తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేసింది.

- Advertisement -

అమ్మాయి బాగుంది అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీరాజాస్మిన్ తర్వాత తెలుగులో గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారధి, యమగోల మళ్ళీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, మోక్ష లాంటి సినిమాల్లో నటించింది. ఈ మధ్యనే రీఎంట్రీలో విమానం అనే సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో ఆమె కనిపించింది. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఒక తమిళ సినిమా ఉంది. తెలుగులో కూడా ఒక మంచి ప్రాజెక్టు ద్వారా రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here