రెండు సినిమాలకే నీతులు చెప్పేస్తోన్న మీనాక్షి చౌదరి.. కారణమిదేనా!

- Advertisement -

2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’సినిమా తో ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది మీనాక్షి చౌదరి.. ఆ సినిమాలో సుశాంత్ హీరో గా నటించాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత మాస్ మహా రాజా రవితేజ హీరోగా ‘ఖిలాడి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ ఈ సినిమాలో ఈ అమ్మడు తన గ్లామర్ తో హీట్ పుట్టించింది. ఆ తరువాత అడివి శేష్ సరసన నటించిన ‘హిట్‌ 2’తో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఈ సినిమా మీనాక్షి కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది.. మీనాక్షి ప్రస్తుతం ‘గుంటూరు కారం’సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది.దీనితోపాటు ఆమె విశ్వక్‌సేన్‌, వరుణ్‌తేజ్‌తో సినిమాలలో కూడా నటిస్తుంది.గుంటూరు కారం’సినిమాలో అనుకోకుండా పూజ హెగ్డే తప్పుకోవడంతో మీనాక్షి కి బంపర్ ఆఫర్ వచ్చినట్లు అయింది. నటి మీనాక్షి చౌదరి సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం తనకు సంబంధించి ఏదొక పోస్ట్ పెడుతుంది.ఈ భామ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు.కష్టం, లేదా సుఖం.. పరిస్థితి ఏదైనా సరే చిరునవ్వుతో ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో భావోద్వేగాలతో నా జీవితం ఒక రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా సాగింది. ఇలాంటి దశలను నేనెప్పుడూ కూడా అనుభూతి చెందలేదు. కిందపడ్డా, ప్రయత్నించా, మళ్లీ తిరిగి లేచా.. ఇలా నా జీవితం సాగింది. ఆత్మ పరిశీలనతో నా జీవితాన్ని చూసే విధానం మారింది. ఇక, ప్రతి దశలోనూ ఈ చిరునవ్వు నాకు తోడుగా ఉంది. కాలంతోపాటు పరిస్థితులు కూడా మారతాయనే విషయాన్ని అదే నాకు అర్థమయ్యేలా అయితే చేసింది. కాబట్టి, జీవితంలో మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా సరే.. చిరునవ్వు చిందించిన క్షణాలను గుర్తు చేసుకోండి” అని ఆమె పోస్ట్ చేసారు.ఆ పోస్ట్ లో పలు ఫొటోలను ఆమె అభిమానులకు షేర్ చేసింది.. ఇందులోని ప్రతి ఫొటోలో కూడా మీనాక్షి నవ్వుతూ ఎంతో ఆనందంగా కనిపించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here