Manchu Manoj : ఒకరికొకరు మధ్య దూరం పెరుగుతుంది

- Advertisement -

Manchu Manoj : ఒకరికొకరు మధ్య దూరం పెరుగుతుందంటూ హీరో మంచు మనోజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. అవగాహనతో కరెక్ట్ లీడర్ ను, పది మందిని కలుపుకుని వెళ్లే లీడర్ ను వెతుక్కోండని తెలిపారు. వాళ్ల ఫ్యామిలీ, చుట్టుపక్కల వాళ్ళుకు హెల్ఫ్ చేయలేని వాళ్లు మీకేం హెల్ఫ్ చేస్తారన్నారు. ఈ అంశాలను గుర్తు పెట్టుకుని ఏ లీడర్ వస్తే పేదలకు న్యాయం జరుగుతుందో వారికి ఓటు వేయండని అన్నారు.

manchu manoj
manchu manoj

డబ్బులు ఉన్నాయి కదా అని ఇస్తే తీసుకోండి.. మీకు నచ్చిన వాళ్లకు ఓటు వేయాలని కోరారు. అందరు కలిసి ఉంటేనే దేశానికి బలమన్నారు. ఈ మధ్య ప్రేమ కనిపించడం లేదన్నారు. ఒకరికొకరు మధ్య దూరం పెరుగుతుందని తెలిపారు. మనుషులను విభజించి పాలించకూడదన్నారు. ఒంటరిగా విజయం సాధించవచ్చు.. ఆ సాధించే క్రమంలో మీ వెంట ఉన్న వారిని మర్చిపోకండి అన్నారు.

ప్రతి ఎదుగుదలలో కొత్త పరిచయాలు వస్తుంటాయని, కొత్త పరిచయాలు వచ్చాయని పాత పరిచయాలు వదిలేస్తే.. మనం మనుషులం కాదు మృగాలం అన్నారు. అందుకే గతాన్ని మర్చిపోకూడదు.. పాత స్నేహాన్ని మర్చిపోకూడదని తెలిపారు. ఒక లీడర్ క్వాలిటీ విభజించి పాలిచడం కాదన్నారు. అందరిని కలుపుకుని వెళ్లే వాడే లీడర్… అన్నారు. ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థం మనిషిని కిందకు దించేస్తాయన్నారు. అంతా నాది అనుకుంటే అతని “పీస్ ఆఫ్ మైండ్” (మనశ్శాంతి ) అంతటితో ఆగిపోతుందన్నారు. ఓటును డబ్బుకు అమ్ముకోకండి.. జీవితం ఎంతో ఉందని అన్నారు. అతను మంచి నాయకుడా.. కాదా.. అందరిని విడదీస్తూ వస్తున్నాడా? కలుపుకుని వస్తున్నాడా? తప్పులు చేస్తున్నాడా? పరిశీలించాలని కోరారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here