మళ్లీపెళ్లి చేశాక నన్ను అందరూ అలానే చూస్తున్నారు… షాకింగ్ కామెంట్స్ చేసిన నటి వనితా

- Advertisement -

ప్రముఖ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల పెద్ద కుమార్తె అయిన వనితా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 1999లో డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో సుశీల పాత్రలో ఆమె నటించారు. అప్పట్లో ఈ మూవీ ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా.. సుశీల పాత్ర ప్రేక్షకులకు చేరువయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత వనితా మరో మూవీలో కనిపించలేదు. దేవి తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు.

వనితా
వనితా

చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వనితా.. కొద్ది రోజులుగా ఎక్కువగా వివాదాలతోనే వార్తలలో నిలుస్తున్నారు. తండ్రితో వివాదం.. పెళ్లిళ్లు.. బిగ్ బాస్ షో.. తోటి నటీమణులతో గొడవలతో నిత్యం వార్తలలో నిలిచింది. ఇక చాలా సంవత్సరాల తర్వాత వనితా విజయ్ కుమార్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. డైరెక్టర్ ఎమ్మెస్ రాజు దర్శకుడిగా తెరకెక్కించిన మళ్లీ పెళ్ళి సినిమాలో నటించారు వనితా. నరేష్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన ఈ సినిమాపై నవరసరాయ చాలా అంచనాలే పెట్టుకున్నారు. కానీ, ఆ అంచనాలు తలకిందులయ్యాయి.

తాజాగా వనితా విజయకుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం బయట మీడియాతో మాట్లాడిన వనిత.. తనను తెలుగు ప్రజలు ఇప్పటికీ ‘దేవి’ సినిమాలో సుశీలగానే గుర్తుపడుతున్నారని చెప్పారు. ‘మళ్ళీ పెళ్లి సినిమాలో నా నటనకు మంచి పేరు వచ్చింది. హైదరాబాద్‌లో నేను షూటింగ్ ఏమైనా ఉంటేనే ఉంటాను. లేకపోతే చెన్నైకి వెళ్లిపోతాను. మళ్ళీ పెళ్లి షూటింగ్ అప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. మళ్లీ ఇప్పుడు తిరుపతిలో రెండు రోజులు ఉన్నాను. చాలా మంది తెలుగువాళ్లను కలిశాను. అందరూ నన్ను ప్రశంసిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందకు ఎం.ఎస్.రాజు గారికి ధన్యవాదాలు’ అని వనిత అన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here