Guntur Kaaram చిత్రం సినిమా చూసేందుకు వచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ పై దాడులు జరిపిన మహేష్ ఫ్యాన్స్!

- Advertisement -

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. పాపం అభిమానులు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ ఆశలను మొత్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిరి చేసాడు అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేసారు.

Guntur Kaaram
Guntur Kaaram

ఈ చిత్రం మరో ‘అజ్ఞాతవాసి’ అయ్యే ప్రమాదం నుండి త్రుటిలో తప్పిందని, మహేష్ బాబు సినిమా ప్రారంభం నుండి చివరి వరకు తన ఎనర్జిటిక్ యాక్టింగ్ మరియు కామెడీ టైమింగ్ తో పర్లేదు ఒకసారి చూడొచ్చు అనే రేంజ్ లో నిలబెట్టాడని, త్రివిక్రమ్ శ్రీనివాస్, థమన్, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఇలా ముగ్గురు పోటీ పడి ఈ సినిమాని అస్సాం ట్రైన్ ఎక్కించారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Mahesh babu

ఇది ఇలా ఉండగా ఈ సినిమా బెన్ఫిట్ షోస్ ని నిన్న హైదరాబాద్ లో పలు థియేటర్స్ లో ప్లాన్ చెయ్యగా, ‘శ్రీ రాములు’ థియేటర్ లో పడిన షో కి త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి చూసాడు. ఇంటర్వెల్ వరకు సినిమాని చూసిన త్రివిక్రమ్, ఆ తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ని అర్థం చేసుకొని, సైలెంట్ గా ఎవరికీ కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

- Advertisement -
Guntur Kaaram mahesh babu

సినిమా చూసి బయటకి వచ్చిన తర్వాత ఒక అభిమాని మీడియా తో మాట్లాడుతూ ‘ఇందాక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని ఇంటర్వెల్ వరకు చూసి వెళ్ళాడు. చివరి వరకు సినిమా చూసి ఉండాల్సింది, కుర్చీ ని మడతపెట్టి మెడ మీద దె** వాళ్ళం’ అంటూ కామెంట్ చేసాడు. అంతే కాదు, సుదర్శన్ థియేటర్ లో నేడు మహేష్ బాబు మరియు మూవీ టీం మొత్తం అభిమానులతో కలిసి షో చూసారు. ఆ సమయం లో కూడా కొంతమంది అభిమానులు త్రివిక్రమ్ పై దాడి చెయ్యడానికి మీదకు దూసుకొని రాగ, బౌన్సర్లు ఆపేసారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here