Prabhas : బాలీవుడ్ హీరోయిన్లే కావాలంటున్న ప్రభాస్.. సలార్-2 లో బీ టౌన్ బ్యూటీ

- Advertisement -

Prabhas : పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ కేవలం బాలీవుడ్ హీరోయిన్లతో రొమాన్స్ చేసేందుకే ఇష్టపడుతున్నాడా… అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే బాహుబలి తర్వాత ఈ హీరో నటించిన చిత్రాల్లో దాదాపుగా బీ టౌన్ బ్యూటీసే ఉండటం దీనికి ఓ కారణం. బాహుబలి తర్వాత వచ్చిన మూవీ సాహోలో.. బీ టౌన్ భామ శ్రద్ధా కపూర్ నటించింది. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ లో టాలీవుడ్ లో నటించినా.. నేటివ్ మాత్రం బాలీవుడే అయిన పూజా హెగ్డే.. దాని తర్వాత ఆదిపురుష్ లో హిందీ భామ కృతి సనన్.. ఇక ఇప్పుడు తీస్తున్న కల్కిలోనూ దీపికా పదుకోణె, దిశా పటానీ.. ఇద్దరూ బాలీవుడ్ భామలే. దీన్ని బట్టి ప్రభాస్ ఛాయిస్ బీ టౌన్ కే ఓటేస్తున్నట్లు కనిపిస్తుంది కదా. అయితే ఇటీవల వచ్చిన సలార్ పార్ట్-1లో మాత్రం మిస్ అయిందని అనుకునేలోగానే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..?

Prabhas
Prabhas

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్- 1’ గతేడాది బ్లాక్​బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్​తో తెరకెక్కిన ఈ మూవీ డార్లింగ్ ప్రభాస్​కు సూపర్ సక్సెస్ అందించింది. తొలి భాగానికి కొనసాగింపుగా ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రెండో పార్ట్​ తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్ షూటింగ్ కూడా రీసెంట్​గా ప్రారంభమైంది. ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. పార్ట్-2లో ఓ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తోందట. ఇంతకీ ఆమె ఎవరంటే..?

బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అడ్వాణీ సలార్ – పార్ట్ 2లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుందట. పార్ట్-2​లో ఆమె డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కియారాతో ఓ స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడట. కానీ, కియారా పాత్ర సెంకడ్ హాఫ్​లో ఎంట్రీ ఇస్తుందని టాక్. ఇక ప్రభాస్- కియారా జోడీ బిగ్ స్క్రీన్​పై సందడి చేస్తుంటే క్రేజీగా ఉంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

తొలి పార్ట్​లో శ్రుతి హాసన్ హీరోయిన్​గా నటిచిగా.. రెండో పార్ట్​లో కూడా ఆమె కొనసాగనుంది. సలార్ పార్ట్​-1లో శ్రుతి హాసన్​కు పెద్దగా డైలాగులు, స్క్రీన్ టైమ్​ ఇవ్వలేదు. సినిమా మొత్తం ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్​పైనే సాగింది. మరి సీక్వెల్​లోనైనా ప్రశాంత్ హీరోయిన్లకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారో చూడాలి.  తొలిపార్ట్​లో సీనియర్ నటుడు జగపతిబాబు, శ్రేయా రెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. ఈ సినిమా వరల్డ్​వైడ్​గా దాదాపు రూ.700+ కోట్లు వసూల్ చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here