జూనియర్ ఎన్టీఆర్ వల్ల ‘జియో’ సంస్థ కి 500 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది..?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ #RRR చిత్రం తర్వాత పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ కి ఎగబాకిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ఊహించని రేంజ్ పాపులారిటీ రావడం తో ఇక నుండి చెయ్యబోయే ప్రతీ సినిమా కూడా భారీ లెవెల్ లో ఉండాలని కోరుకుంటున్నాడు.అందుకు అనుగుణముగానే ఆయన అడుగులు వేస్తున్నాడు.ప్రస్తుతం ఆయన మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్

నెల రోజుల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటుంది.ఈ చిత్రం తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా, ఆ తర్వాత బాలీవుడ్ లో ‘వార్ 2’ చెయ్యబోతున్నాడు. వీటితో పాటు ఆయనతో సినిమాలు చెయ్యడానికి టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు స్టార్ డైరెక్టర్స్ మరియు స్టార్ నిర్మాతలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

రిలయన్స్ జియో సంస్థ ఎన్టీఆర్ తో ‘ది ఇమ్మొర్తల్ అశ్వథామ’ అనే భారీ బడ్జెట్ సినిమాని ప్లాన్ చేయబోతుంది అంటూ గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం సాగుతుంది. ఇందులో ఇద్దరు హీరోల అవసరం ఉంది.ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరో గా నటించడానికి బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఒప్పుకున్నాడు. మరో హీరో కోసం ఎన్టీఆర్ ని సంప్రదించారు, ఎన్టీఆర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పలేదు, అలా అని నో కూడా చెప్పలేదు.

- Advertisement -

ఇలా ఏ విషయం చెప్పకపోయేసరికి జీ సంస్థ కి భారీ మొత్తం లో నష్టం వచ్చిందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం సుమారుగా 30 కోట్ల రూపాయిలను ఖర్చు చేసారు. అయితే ఎన్టీఆర్ ఎటూ తేల్చకపోవడం తో 500 కోట్ల రూపాయిల బడ్జెట్ మొత్తం వేస్ట్ అయ్యే ప్రమాదం ఉన్నందున, ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపివెయ్యడమే మంచిది అనే ఉద్దేశ్యానికి వచ్చారట మేకర్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here