Janhvi Kapoor : నా రోజు మొదలయ్యేది ముగిసేది నీతోనే అమ్మ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన జాన్వీ కపూర్..

- Advertisement -

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల తనయ జాన్వీ కపూర్.. నా తల్లి నటన వారసత్వం పుణికి పుచ్చుకొని బాలీవుడ్ ని షేక్ చేస్తోంది ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా జాన్వీ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా జాన్వీ తన తల్లి శ్రీదేవితో ఉన్న ఫోటోలు పోస్ట్ చేస్తూ.. ఓ ఎమోషనల్ నోట్ ను రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Janhvi Kapoor
Janhvi Kapoor

అలనాటి అందాల నటి శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న అనంత లోకాలకు వెళ్లిపోయారు.. మరో రెండు రోజుల్లో ఆమె వర్ధంతి దగ్గరకు రావడంతో జాన్వీ కపూర్ తన తల్లిని తలచుకుంటూ భావోద్వేగంతో కూడిన మాటలను సోషల్ మీడియాలో పంచుకుంది.. జాన్వీ తన తల్లి శ్రీదేవితో పాటు కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ రాసింది..

Janhvi Kapoor Emotional note on her mom  sridevi

అమ్మా.. నేను నీకోసం ఇప్పటికీ ప్రతి చోటా వెతుకుతూనే ఉన్నాను.. నేను చేసే ప్రతి పని నువ్వు గర్వపడేలాగా ఉంటుందని.. నేను కోరుకుంటున్నాను. నా రోజు మొదలయ్యేది మీ ఆలోచనలతోనే.. అలాగే నా రోజు ముగిసెది నీ ఆలోచనతోనే.. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అది నీతోనే ముగుస్తుంది అంటూ.. జాన్వీ కపూర్ తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ నోట్ ను రాసుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ శ్రీదేవి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జాన్వి కపూర్ తన తల్లిని ఎంతగా మిస్ అవుతుందో ఈ నోట్ తో అర్థమవుతుంది.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి నాలుగు భాషలకు పైగా వందలాది సినిమాలలో హీరోయిన్ గా నటించారు. తన అందం , అభినయం , నటనతో ప్రేక్షకులను మంత్ర ముద్దులను చేశారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. టాలీవుడ్ లో కూడా జాన్వీ ఎంట్రీ కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here