చాలా రోజులుగా భర్తకు దూరంగా ఉంటున్న ప్రియమణి.. తర్వాత విడాకులేనా అని అడుగుతున్న ఫ్యాన్స్

- Advertisement -

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టాలెంటెడ్ బ్యూటీ ప్రియ‌మ‌ణి.. ప్ర‌స్తుతం స్టార్ హీరోల చిత్రాల్లో స‌హాయ‌క పాత్ర‌లు పోషిస్తోంది. రీసెంట్ గా విడుద‌లైన క‌స్ట‌డీ మూవీలోనూ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో ఆక‌ట్టుకుంది. అలాగే వెబ్ సిరీస్ లు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కూడా క‌మిట్ అవుతూ కెరీర్ ను కొన‌సాగిస్తోంది. ఈమె సినీ కెరియర్ హిట్ అయినప్పటికీ వ్యక్తిగత కెరియర్ లో కూడా ఎన్నో కాంట్రవర్సీల్లో చిక్కుకుందని చెప్పవచ్చు.

ప్రియమణి
ప్రియమణి

ప్రియ‌మ‌ణి ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. హీరోయిన్ గా పెయిడ్ అవుట్ అయిన టైమ్ లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళాడింది. అయితే ముస్తఫా రాజ్ కు ఇది రెండో వివాహం. ప్రియ‌మ‌ణి కంటే ముందు ముస్తఫా రాజ్ ఒక యువ‌తిని వివాహం చేసుకోగా.. మ‌న‌స్ప‌ర్థ‌లు విడిపోయారు. ఆ త‌ర్వాత ప్రియమ‌ణి, ముస్తఫా రాజ్ ప్రేమించుకుని.. చాలా సింపుల్ గా రిజిస్ట‌ర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు. వివాహం జ‌రిగి చాలా ఏళ్లు అవుతున్నా.. వీరిద్ద‌రికీ సంతానం లేరు. పైగా చాలా కాలం నుంచి ముస్తఫా రాజ్, ప్రియ‌మ‌ణి దూరంగా ఉంటున్నారు.

అంతేకాదు ప్రియమణి (Priyamani) కి పిల్లలు కనడం ఇష్టం లేదు అని కూడా గతంలో ఒక టాక్ వినిపించింది. అయితే ఈ మధ్యకాలంలో ప్రియమణి తన భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చింది.అయితే తాజాగా మరోసారి ప్రియమణి భర్తకు దూరంగా ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇక అసలు విషయంలోకి వెళ్తే..ప్రియమణి తాజాగా తన బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకుంది. కానీ ఈ బర్త్డే ఫొటోస్ లో తన భర్త కనిపించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. భార్య బర్త్ డే రోజు భర్త కనిపించకపోవడంతో అందరిలో మరోసారి అనుమానాలు రేకెత్తాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here