12 మందిని పెళ్లి చేసుకున్న విశాల్.. అసలు విషయమిదే..

- Advertisement -

సల్మాన్‌ఖాన్‌ పెళ్లి చేసుకున్న తర్వాత తాను కూడా చేసుకుంటానని సినీ నటుడు విశాల్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన టైమ్‌ ట్రావెల్‌ మూవీ ‘మార్క్‌ ఆంటోనీ’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఆంగ్ల మీడియాకు వచ్చిన ఇంటర్వ్యూలో విశాల్‌ మాట్లాడారు.

విశాల్
విశాల్

‘పెళ్లెప్పుడు’ అన్న ప్రశ్నకు పైవిధంగా స్పందించారు. ప్రతి దానికి ఒక సమయం ఉంటుందని అన్నారు. ‘‘సాధారణంగా నేను వివాదాలపై స్పందించను. ఇటీవల తప్పనిసరి పరిస్థితుల్లో ఒక ట్వీట్‌ చేశాను. నటి లక్ష్మీ మేనన్‌ను నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది నాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అవతలి అమ్మాయి భవిష్యత్‌ కూడా ఉంది. నేను స్పందించకపోతే, ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది. నా గురించి ఏ విషయమైనా మీరు ఫోన్‌ చేసి అడగవచ్చు. గతంలో చాలా మందిని పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రాశారు.

నిజం చెప్పాలంటే నా 19ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకూ 12మందిని పెళ్లి చేసుకున్నట్లు రాశారు. చిన్నప్పటి నుంచి నాకు సంబంధించిన విషయాలు పేపర్‌లో వస్తే, కట్‌ చేసి భద్రపరచడం మా నాన్నగారికి అలవాటు. అలా ఒకరోజు ఏదో పేపర్‌ కట్‌ చేస్తుంటే, ‘ఏం చేస్తున్నారు’ అని అడిగా, ‘లక్ష్మీ మేనన్‌తో నీకు పెళ్లి అని వార్త వచ్చింది’ అన్నారు. అలా ఆ విషయం నాకు తెలిసింది. హీరోయిన్‌లలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైనా భోజనానికో, సినిమాకో వెళ్దామని వాళ్లు అడిగితే, నేను వద్దనే చెబుతాను. బయట జంటగా కనిపిస్తే, డేటింగ్‌లో ఉన్నామని వార్తలు రాసేస్తారు. అందుకే మా ఇంట్లో భోజనం చేసి, సరదాగా కబుర్లు చెప్పుకొంటాం’’అని విశాల్‌ చెప్పుకొచ్చారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here