నాకేం సంబంధం లేదు.. నేనెక్కడికీ పారిపోలేదంటున్న నవదీప్

- Advertisement -

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మరోసారి డగ్స్ కలకలం రేపుతోంది. హైదరాబాదులో మాదాపూర్ డ్రగ్స్ కేసు విషయంలో పలు కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు హీరో నవదీప్ పేరు మార్మోగిపోతుంది. హీరో నవదీప్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా సీపీ సీవీ ఆనంద్ తెలియజేసినట్లు జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే కొన్నేళ్ల క్రితం మాదాపూర్ డ్రగ్స్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ విషయం తెలిసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కేసుతో సంబంధం ఉందని భావించిన చాలామంది సెలబ్రిటీలను, పోలీసులు అధికారులతో పాటు ఇన్ ఫార్మర్లు కూడా ప్రశ్నించారు.

నవదీప్
నవదీప్

డ్రగ్స్ కేసు యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ తతంగం తర్వాత కొంతమంది పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. మరికొందరైతే ఏకంగా ఫ్యామిలీతో షిఫ్ట్ అయినట్లు, కాంటాక్ట్ లేకుండా ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అధికారుల తెలిపారు. ఇలాంటి వారిలో మేఘన సినిమా డైరెక్టర్, ఇంద్ర తేజ్, నవదీప్, శ్వేత ,కార్తీక్ ఇలా పలువురు సెలబ్రిటీలు పరారీలో ఉన్నారని తెలియజేశారు. అయితే ఈ పేర్లలో సోషల్ మీడియాలో ఎక్కువగా హీరో నవదీప్ పేరు హైలెట్ అవుతోంది. నవదీప్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వ్యవహారం పైన ఆయన స్పందించారు. తను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను పరారు కాలేదని హైదరాబాదులో ఉన్నానన్నారు. డ్రగ్స్ కేసుతో నాకెలాంటి ఎలాంటి సంబంధం లేదన్నారు. హీరో నవదీప్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2021లో మంచు విష్ణు హీరోగా వచ్చిన మోసగాళ్లు అనే సినిమాలో కనిపించారు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లపై ఆయన దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here