Saipallavi : టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్లగా స్టార్ హీరోకు ఉండే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి సినిమా నుంచి బోల్డ్ టచ్ లేకుండా డీ గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఆమె నటించే ప్రతి సినిమాలోనూ తన న్యాచురల్ నటనతో మన ఇంట్లో అమ్మాయి అనిపించేలా ప్రేక్షకులను మెప్పించింది. మాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమమ్తో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. తర్వాత తెలుగు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.
అయితే ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇందులో భాగంగా ఇంటర్వ్యూవర్ మీ ముఖం మీద మొటిమలు మాయమయ్యాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మొటిమలు ఎక్కువగా కనిపించేవి. మీరు వాటికి సర్జరీ చేయించుకున్నారా అని ప్రశ్నించింది. దానిపై సాయి పల్లవి స్మైల్ తో స్పందించింది. అమ్మాయిల వయసును బట్టి మొటిమలు వస్తూ.. పోతూ.. ఉంటాయి. వాటికి సర్జరీ చేయించాల్సిన అవసరం లేదు. నిజానికి నా ఫస్ట్ సినిమాలో అవకాశం కూడా మొటిమల కారణంగానే వచ్చింది.. అవి ఉన్నా నాకు ఇబ్బంది లేదంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మీరు ఎంత డీసెంటుగా ఉంటారో.. ఎలాంటి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలుసు. మీలాంటి వారిపై చెత్త రూమర్స్ క్రియేట్ అయిన ఎవరూ నమ్మరంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సాయి పల్లవి.. నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తుంది. దాంతో పాటు బాలీవుడ్ లో నితిష్ తివారి డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమాలోనూ నటిస్తుంది. దీనికి సంబంధించిన పిక్స్ ఇటీవల లీక్ అయి తెగ వైరల్ గా మారాయి.