పవర్ అస్త్రా కోసం మాస్టార్ ప్లాన్ వేసిన సందీప్.. అందుకే అతడిని రంగంలోకి దింపాడా..!

- Advertisement -

రెండో వారంలో ముందు మాయాస్త్రం, ఆ తర్వాత పవర్ అస్త్రా అంటూ కాస్త డోస్ పెంచాడు బిగ్ బాస్. ఇప్పటికే మాయాస్త్రం కోసం రెండు టీమ్స్ పోటీపడడం, అందులో నుండి ఒక టీమ్ గెలవడం కూడా అయిపోయింది. అలా గెలిచిన టీమ్ అందరికీ మాయాస్త్రాలు దక్కాయి. కానీ మాయాస్త్రాలు దక్కడం పాయింట్ కాదు.. దాని తర్వాత అందులో ఎవరు పవర్ అస్త్రాను దక్కించుకోగలరు అన్నదే పాయింట్.

బిగ్ బాస్
బిగ్ బాస్

ఆ పవర్ అస్త్రాను దక్కించుకునే రేసులో ప్రస్తుతం ఇద్దరు కంటెస్టెంట్స్ ఉండగా.. అనూహ్యంగా మూడో కంటెస్టెంట్ కూడా ఈ పోటీలో జాయిన్ అయ్యాడు. పవర్ అస్త్రా కోసం పోటీపడే కంటెస్టెంట్స్‌లో ఇద్దరే మిగిలారు. అదే శివాజీ, షకీలా. కానీ ఇంతలోనే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. రెండో పవర్ అస్త్రా కోసం మరొక కంటెస్టెంట్ పోటీ పడవచ్చని, ఆ పోటీపడే కంటెస్టెంట్ ఎవరైతే బాగుంటుందో సందీప్ డిసైడ్ చేయాలని బిగ్ బాస్ తెలిపారు.

బిగ్ బాస్ చెప్పిన విషయానికి అందరూ షాక్ అయ్యారు. ఎవరికి వారు పవర్ అస్త్రాను ఎవరికి దక్కితే బాగుంటుంది అనే విషయాన్ని సందీప్‌తో విడివిడిగా చర్చించడం మొదలుపెట్టారు. కానీ సందీప్ నిర్ణయం ఫైనల్‌గా నిలిచింది. రెండో పవర్ అస్త్రా కోసం షకీలా, శివాజీ, అమర్‌దీప్.. రంగంలోకి దిగారు. టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో ఒక చెవిని ఏర్పాటు చేశారు. ఆ చెవిలో ఎవరైతే బిగ్ బాస్ అని గట్టిగా అరుస్తారో.. వారికే పవర్ అస్త్రా దక్కుతుందని బిగ్ బాస్ వెల్లడించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here