బిగ్ బాస్ హౌస్ లో చిచ్చు పెట్టిన ఇంజెక్షన్.. పర్సనల్ విషయాలు తీస్తూ తిట్టుకున్న కంటెస్టెంట్స్..

- Advertisement -

మొదటి నుండి రేసులో లేకపోవడం కంటే రేసులో చివరి వరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధగా ఉంటుంది. కానీ అలా జరిగినప్పుడు ఆ పరిస్థితిని అంగీకరించగలగాలి. అలా అంగీకరించలేకపోవడం వల్లే బిగ్ బాస్ హౌజ్‌లో గొడవలు జరుగుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి రెండు వారాలు అయినా కూడా ఇప్పటివరకు పెద్దగా గొడవలకు దిగని గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్‌కు మాయాస్త్రం కోసం వాగ్వాదం మొదలయ్యింది. ఆ వాగ్వాదం కాస్త పర్సనల్ కూడా అయ్యింది. ప్రిన్స్ యావర్ చేతి నుండి మయాస్త్రం జారిపోవడంతో కోపంతో ఊగిపోయాడు.

బిగ్ బాస్
బిగ్ బాస్

కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమర్‌దీప్ వెళ్లి తనను కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నించాడు. శుభశ్రీ సైతం యావర్‌తో పర్సనల్‌గా మాట్లాడాలని ప్రయత్నించింది కానీ యావర్ అసలు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. ‘కరెక్ట్ కారణం చెప్పి తీసేయాలి’ అంటూ గౌతమ్‌పై అరవడం మొదలుపెట్టాడు యావర్. ‘అది కరెక్ట్ కారణమే. శివాజీ అన్ననే అర్హుడు’ అంటూ గౌతమ్ కూడా తిరిగి అరవడం మొదలుపెట్టాడు. ఇద్దరూ కోపంతో ఊగిపోయారు. ఒకరిపై ఒకరు విపరీతంగా అరుచుకున్నారు. ఆ తర్వాత యావర్.. తన చేతితో అసభ్యంగా ఏదో చూపించే ప్రయత్నం చేశాడు.

bigg boss 7

కోపంతో గౌతమ్ కృష్ణ కూడా సైగ చేశాడు. అది ఇంజెక్షన్ అన్నట్టు భావించిన యావర్.. ‘నేను ఇంజెక్షన్ తీసుకున్నానా? నువ్వు చూశావా’ అంటూ మరింత కోపంతో రగిలిపోయాడు. ‘నీ డబ్బులతో తీసుకున్నానా’ అని గౌతమ్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత తను ఎలాంటి ఇంజెక్షన్ తీసుకోలేదని, తన గురించి అన్యాయంగా మాట్లాడుతున్నారు అంటూ వాపోయాడు. ‘నేను డాక్టర్‌ను నాకు ఆ మాత్రం తెలియదా’ అంటూ గౌతమ్.. ఇతర కంటెస్టెంట్స్‌తో ఇంజెక్షన్ మ్యాటర్ నిజమే అన్నట్టుగా మట్లాడాడు. ప్రిన్స్ యావర్ విచక్షన్ కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తుండడంతో బిగ్ బాస్.. తనను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ధైర్యం చెప్పాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here