Divi Vadthya : ‘పుష్ప ది రూల్’​లో బిగ్​బాస్ బ్యూటీ..!

- Advertisement -

అల్లు అర్జున్​ను ఐకాన్ స్టార్​గా మార్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమా బన్నీకి ప్యాన్ ఇండియాలో గుర్తింపు తీసుకువచ్చింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిన కూడా రికార్డు స్థాయిలో రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటిదాకా సౌత్ ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకోని బాలీవుడ్​ పుష్ప మేనియాతో ఒక్కసారిగా సౌత్​పై ఫోకస్ చేసింది. సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది. దక్షిణాది స్టార్లను పొగడ్తలతో ముంచెత్తడం షురూ చేసింది. పుష్ప మూవీకి ఈ రేంజ్​లో క్రేజ్ వస్తుందని మేకర్స్ కూడా ఊహించలేదు. పుష్ప పార్ట్ 1కు వచ్చిన క్రేజ్ చూసి డైరెక్టర్ సుకుమార్ దీనికి సీక్వెల్ తీయడానికి రెడీ అయ్యాడు. పార్ట్ 2 విషయంలో దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Divi Vadthya
Divi Vadthya

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ కోసం బడ్జెట్​ను రూ. 350 కోట్లకు మించి ఖర్చు చేస్తున్నారట. అంతే కాకుండా పార్ట్ 1కు వచ్చిన రిజల్ట్​ను, క్రేజ్​ను దృష్టిలో పెట్టుకుని పుష్ప ది రూల్​ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారట. దీనికోసం ఇప్పటికే సుకుమార్ అండ్ టీమ్ ప్లానింగ్ రెడీ చేసింది. షూటింగ్ కూడా మొదలు పెట్టారు. చైనా, థాయ్​లాండ్​లలో పలు కీలక ఘట్టాలని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే పలు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. థాయ్​లాండ్​లోని దట్టమైన అడవుల్లో అల్లు అర్జున్​పై భారీ స్థాయిలో పులి ఫైట్​ని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా ఓ వార్త రీసెంట్​గా బయటకు వచ్చింది.

- Advertisement -

ఇక పుష్ప-2లో పాత్రల గురించి మాట్లాడితే.. అల్లు అర్జున్​తో పాటు శ్రీవల్లి అదేనండి రష్మిక కూడా ఉంటుంది. కాకపోతే తొలి పార్ట్​లో ఉన్నట్లు ఆమె పాత్రకు సెకండ్​ పార్ట్​లో అంత ప్రాధాన్యం ఉండకపోచ్చునని టాక్. అంతే కాకుండా శ్రీవల్లి క్యారెక్టర్​ను చంపేసి సినిమాలో ఎమోషనల్ యాంగిల్​ కూడా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట సుకుమార్. ఇక ఫస్ట్ పార్ట్​లో ఉన్న విలన్స్ సునీల్, అనసూయ పాత్రల నిడివి సెకండ్ పార్ట్​లో పెంచాలనే యోచనలో ఉన్నారట.

వీళ్లే కాకుండా ఇప్పటికే కీలక లేడీ విలన్ పాత్ర కోసం కేథరిన్​ని, మరో కీలక పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్​పాయ్​ను కూడా డైరెక్టర్ సుకుమార్ ఫైనల్ చేసినట్లు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లే కాకుండా మరో బ్యూటీని కూడా ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు గాడ్​ఫాదర్ మూవీలో చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన బిగ్​బాస్ బ్యూటీ దివి.Divi Vadthya  పుష్ప-2లో ఓ టీవీ ఛానల్​కు సంబంధించిన లేడీ జర్నలిస్టు పాత్ర కోసం ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దానికోసం ఓ ప్రముఖ లేడీ జర్నలిస్టుతో దివికి వర్క్​షాప్ కూడా నిర్వహించి ఫైనల్ చేశారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here