Vaishnavi : జాక్ పాట్ కొట్టిన వైష్ణవి… పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్

- Advertisement -

Vaishnavi : ఒకప్పుడు ఇండస్ట్రీలో తాతలు తండ్రుల పేర్లు చెప్పుకుని ఎంట్రీలు ఇచ్చే వారు ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమాని సామాన్యులు కూడా వెండి తెరపై వెలుగుతున్నారడానికి ఫర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ వైష్ణవి చైతన్యనే. బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది వైష్ణవి. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి వెండితెరపై తన టాలెంట్ నిరూపించుకుంది. ప్రస్తుతం అమ్మడి పేరు మార్మోగిపోతుంది. అప్పటివరకు కేవలం క్యారెక్టర్ అర్టిస్టుగా చిన్న చిన్న పాత్రలు చేసిన అమ్మడు.. ఇప్పుడు హీరోల ఫస్ట్ చాయిస్ గా మారింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య రేంజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ అందుకోవడంతో పాటు నిర్మాతకు లాభాల పంట పండించింది. పెట్టిన దానికి ఏకంగా ఐదు రెట్లు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది.

Vaishnavi
Vaishnavi

అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన ఆనంద్ దేవరకొండ కంటే కూడా క్రేజ్ వైష్ణవికే దక్కిందనడంలో సందేహం లేదు. బేబీ సినిమా సక్సెస్తో వైష్ణవికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాగా ఇప్పటికే వైష్ణవి ఖాతాలో రెండు భారీ సినిమాలున్నాయి. ఒకటి అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ సినిమా కాగా .. మరొకటి రామ్ పోతినేని తో కలిసి పూరి జగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “డబుల్ ఇస్మార్ట్”. తాజాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైష్ణవి గురించి మరో వార్త హల్ చల్ చేస్తుంది. బేబీ జాక్ పాట్ ఆఫర్ కొట్టిందన్న వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్ బడా హీరో నటిస్తోన్న పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ వచ్చిందట. వాస్తవానికి ఆ రేంజ్ స్టేటస్ బేబీకి లేదు. కానీ తెలుగు అమ్మాయి కావడంతో ఛాన్స్ ఇస్తే సినిమాకి పబ్లిసిటీ వస్తుందని తనను ఫిక్స్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here