Parineeti Chopra : ఆ హీరోయిన్ ని అవకాశం పేరుతో దారుణంగా మోసం చేసిన యానిమల్ డైరెక్టర్..!

- Advertisement -

Parineeti Chopra : ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు అందుకున్న ఇండియన్ ‘A’ రేటింగ్ మూవీగా సందీప్ వంగా దర్శకత్వం వహించిన నిలిచింది. ఈ చిత్రంలో నటీనటులు, ముఖ్యంగా రణబీర్ కపూర్, బాబీ డియోల్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీళ్ల నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి.

హీరోయిన్ పాత్రలో నటించిన రష్మిక మందన్న యాక్టింగ్ కూడా అదుర్స్ అనే టాక్ వినిపించింది. నిజానికి, ఈ చిత్రంలో గీతాంజలి పాత్రకు రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. కానీ, పలు కారణాలతో ఆమె ప్లేస్ ను రష్మిక మందన్నతో రీప్లేస్ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.

Parineeti Chopra
Parineeti Chopra

కొన్ని పాత్రలు కొందరికి మాత్రమే సెట్ అవుతాయని, పరిణీతిలో గీతాంజలిని చూడలేకపోయానని చెప్పారు ఆయన. ఇదే విషయాన్ని ఆమెకు చెప్తే, చాలా అప్‌ సెట్ అయిందని వివరించారు. తప్పు తనదే కాబట్టి, వీలైతే క్షమించాలని ఆమెను కోరినట్లు చెప్పారు. “బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా యాక్టింగ్ నాకు చాలా నచ్చుతుంది. నా సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ‘కబీర్ సింగ్’ సినిమాలో ప్రీతి క్యారెక్టర్ కు ఆమెనే తీసుకోవాలి అనుకున్నాను. కానీ, కొన్ని కారణాలతో ఆమెను తీసుకోలేకపోయాను. ‘యానిమల్‌’ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నప్పుడు చాలా సంతోషం కలిగింది.

- Advertisement -
Rashmika Mandanna

ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ఏడాది ముందే ఈ మూవీ కోసం అగ్రిమెంట్ మీద సంతకం చేసింది. అయితే, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆమెను చూడాలేకపోయాను. ఇదే విషయాన్ని తనకు చెప్పాను. సినిమా విషయంలో రాజీ పడలేనన్నాను. అందుకే, ఈ సినిమాలో మరో హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాను. నేను అలా చెప్పడంతో తను చాలా బాధపడింది. అయినప్పటికీ నా అభిప్రాయాన్ని గౌరవించింది. నా మాటలను అర్థం చేసుకుంది” అని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here