యాంకర్ శ్రీ ముఖికి ఘోర అవమానం.. ఇలాంటిది ఎవరికీ జరగకూడదని ఏడ్చేసింది

- Advertisement -

శ్రీముఖి అంటే కొత్తగా పరిచయం అక్కర్లేదు. పైగా బిగ్ బాస్ పుణ్యమా అని మరింత క్రేజ్ తెచ్చుకుంది కూడా. ఈ షో తర్వాత మరోసారి కెరీర్‌పై ఫోకస్ చేసింది. రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తుంది. ఈ అమ్మడు 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీలో లీడ్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ‘అదుర్స్’ టీవీ రియాలిటీ షో , సూపర్ సింగర్ 9 ప్రోగ్రామ్స్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

sreemukhi
యాంకర్ శ్రీ ముఖికి

ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన ‘పటాస్’ షో శ్రీముఖికి మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. టీవీ, సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3లో పాల్గొంది. అంతేకాదు ఈ షోలో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్టించారు. ప్రస్తుతం శ్రీముఖి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ఈమె ప్రధాన పాత్రలో పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు ఘోర అవమానం జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఎవరికీ ఇలా జరగకూడదంటూ ఏడ్చింది.

శ్రీముఖి

జగిత్యాల జిల్లాలో బైక్ పై అవినాశ్ గ్రామానికి వెళుతూ, శ్రీముఖి చేసిన హంగామా చేసింది. అయితే అక్కడ ఒక అనుకోని ఘటన జరిగింది. రోడ్డుపై సైకిల్ పై వెళుతున్న ఓ వ్యక్తిని శ్రీముఖి ఆపి తనను గుర్తుపట్టమని అడిగింది. అందుకు ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. అంతేకాదు తనకు ఆమె ఎవరో తెలియదని సింపుల్ గా తేల్చేశాడు. దీంతో శ్రీముఖి ఇంతకాలం తాను ఒక సెలబ్రిటీ అని ఫీలవుతున్న భ్రమల నుంచి ఒక్కసారిగా నేలపైకి దిగింది. అయితే ఆ పెద్దమనిషికి ముక్కు అవినాశ్ మాత్రం తెలుసని అది కూడా అతడు టీవీలో నటుడిగా కాదని, ఆ ఊరి వ్యక్తి అవడంతో గుర్తుపట్టినట్లు తేల్చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here