ఆదిపురుష్ ప్రభాస్ కి అమిత్ షా ఫోన్ కాల్.. ట్రైలర్ చూసి ప్రీ రిలీజ్ ఈవెంట్ వస్తానని మాటిచ్చిన అమిత్ షా!

- Advertisement -

ఆదిపురుష్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘ఆదిపురుష్’ మూవీ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ విడుదలకు ముందే అభిమానుల కోసం హైదరాబాద్ లో నిన్న ‘AMB సినిమాస్’ లో స్పెషల్ ప్రీమియర్ వేశారు. దీనికి ఫ్యాన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ మామూలుది కాదు,ఆ హంగామా కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

ఆదిపురుష్
ఆదిపురుష్

ఇక ఈరోజు HD క్వాలిటీ తో ఇంటర్నెట్ లో విడుదల చేసిన ఈ ట్రైలర్ కి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా విజువల్స్ చాలా రిచ్ గా, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. రామాయణం ని ఇంత అద్భుతంగా, లార్జ్ స్కేల్ లో సరికొత్త టెక్నాలజీ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు డైరెక్టర్ ఓం రౌత్ పై సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.

మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులూ అమిత్ షా ప్రభాస్ కి ప్రత్యేకంగా ఫోన్ కాల్ చేసి కాసేపటి క్రితమే అభినందించాడట. రామాయణం ని ఇంత అద్భుతంగా, నేటి తరం ఆడియన్స్ కి అందించబోతున్నందుకు కృతఙ్ఞతలు, ఇలాంటి చిత్రాలు మీలాంటి స్టార్స్ చేసినప్పుడే కోట్లాది మంది ప్రేక్షకులకు చేరుకుంటుంది.

- Advertisement -

మన ఇతిహాసాలకు సంబంధించిన సినిమాలు మీరు మరిన్నీ తియ్యాలి అని కోరారట. అంతే కాదు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ఖరారు చేసిన తర్వాత తనకి సమాచారం అందిస్తే కచ్చితంగా ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరవుతానని, మా ప్రభుత్వం తరుపున నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఈ సినిమాకి కావాలన్నా మేము ముందు ఉంటామని అమిత్ షా హామీ ఇచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here