అలాంటివి చూసినప్పుడు ఎందుకు బ్రతికి ఉన్నానా అని బాధేస్తుంది.. వైరల్ అవుతున్న నాగ చైతన్య కామెంట్స్

- Advertisement -

అక్కినేని నాగచైతన్య ఈమధ్య ఇంటర్వ్యూస్ లో చాలా బోల్డ్ గా మాట్లాడేస్తున్నాడు. ఇంతకు ముందు ఆయన ఈ రేంజ్ లో మాట్లాడింది లేదు, సమంత తో విడాకులు గురించి కూడా చాలా కూల్ గా సమాధానం చెప్తున్నాడు. మనసులో ఒకటి ఉంచుకొని బయట ఇంకోలాగా మాట్లాడుతున్నట్టు అసలు అనిపించలేదు.ఇక ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ మూవీ ఈ నెల 12 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నాగ చైతన్య
నాగ చైతన్య

ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూస్ గ్యాప్ లేకుండా ఇచ్చేస్తున్నాడు.సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన నాగ చైతన్య రీసెంట్ ఇంటర్వ్యూస్ కి సంబంధించిన లేటెస్ట్ కామెంట్స్ హల్చల్ అవుతూ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో వచ్చే కామెంట్స్ పై నాగ చైతన్య కాస్త ఎమోషనల్ గానే రియాక్ట్ అయ్యాడు.ఆయన అభిమానులను కూడా ఆ కామెంట్స్ చాలా కదిలించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను సోషల్ మీడియా పెద్దగా వాడను కానీ, నా సినిమా విడుదలైనప్పుడు మాత్రం బాగా వాడుతాను.ఆ సమయం లో వచ్చే పాజిటివ్ కామెంట్స్ ని చూసి ఎంతో మురిసిపోతుంటాను,అదే సమయం లో నెగటివ్ కామెంట్స్ ని కూడా స్పోర్టివ్ గా తీసుకోగలను కానీ, కొంతమంది చేసే కామెంట్స్ చూసినప్పుడు ఎందుకు బ్రతికి ఉన్నాను రా దేవుడా అని అనిపించేది. ఆరోజు మూడ్ మొత్తం చెడిపోయేది’ అంటూ నాగ చైతన్య మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

ఇకపోతే రీసెంట్ గా విడుదలైన ‘కస్టడీ‘ ట్రైలర్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా నటించాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, అరవింద్ గో స్వామి మరియు శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here