ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్..ప్రభాస్ మాటలకు సిగ్గుపడి వెళ్లిపోయిన కృతి సనన్

- Advertisement -

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న తిరుపతి లో అంగరంగ వైభవం గా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. తిరుపతి నగరం మొత్తం కూడా నిన్న జై శ్రీరామ్ నినందాలతో హోరెత్తిపోయింది. ఇలాంటి రోజు మళ్ళీ వస్తుందో రాదో ఇప్పుడే చెప్పలేము కానీ, నిన్న వినిపించినట్టు రామ నామం ఈమధ్య కాలం లో ఎప్పుడూ కూడా వినిపించలేదు. ఇదంతా ప్రభాస్ ‘ఆదిపురుష్’ కారణంగానే జరిగింది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నంత సేపు ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగ ఎవ్వరికీ అనిపించలేదు. సాక్ష్యాత్తు శ్రీరాముని ఆలయానికి వచ్చి అక్కడ కాసేపు రామనామం తో భజన చేసినట్టు అనిపించింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెయిన్ హైలైట్ గా నిల్చింది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ స్పీచ్. సాధారణంగా ఆయన ఎక్కువగా స్టేజి మీద మాట్లాడడు. అలాంటిది ఈ సినిమా విషయం లో ఆయన అభిమానులతో మనసు విప్పి మాట్లాడాడు.

ఆదిపురుష్
ఆదిపురుష్

3D టీజర్ రెస్పాన్స్ ని చూసే ఈ సినిమాని కొనసాగించాం : ప్రభాస

ప్రభాస్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా కోసం మేము పడిన కష్టం మామూలుది కాదు. ఇక్కడ మీ అందరి కోసం ది బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలని వీళ్ళందరూ నిద్రలు మాని మరీ ఈ సినిమా కోసం పని చేసారు. కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు.వాళ్ళ మొహాలు ఒక్కసారి చూడండి. ఈ చిత్రం టీజర్ విడుదలైనప్పుడు నేను ఓం తో మా ఫ్యాన్స్ కోసం థియేటర్స్ లో 3D వెర్షన్ టీజర్ ని వెయ్యమని చెప్పాను. 3D వెర్షన్ వేసినప్పుడు మీరిచ్చిన రెస్పాన్స్ మమల్ని ఇంత దూరం నడిపించింది. ఒకసారి చిరంజీవి గారు నన్ను అడిగారు. ఏమిటి రామాయణం చేస్తున్నావా అని, అవును సార్ అని చెప్పాను. రామాయణం చెయ్యడం అనేది అదృష్టం, అది నీకు దక్కింది అన్నారు. నిజంగానే శ్రీరాముని పాత్ర పోషించడం నా అదృష్టం గా భావిస్తున్నాను’ అని ప్రభాస్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -

పెళ్లి గురించి కీలక ప్రకటన చేసిన ప్రభాస్ :

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ ని పెళ్లి ఎప్పుడూ అని గట్టిగా అరుస్తూ అడుగుతారు. అప్పుడు ప్రభాస్ ‘పెళ్లా..చేసుకుంటా , ఎప్పుడు చేసుకున్నా కచ్చితంగా తిరుపతి లోనే చేసుకుంటా’ అని సమాధానం ఇస్తాడు. ప్రభాస్ ఇచ్చిన ఆ సమాధానం కి సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది.

కృతి సనన్ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రభాస్ :

ఆయన మాట్లాడుతూ ‘ఆదిపురుష్ లో సీత పాత్ర ని ఎంచుకునేందుకు మేము చాలా కష్టపడ్డాము.ఎప్పుడైతే కృతి సనన్ ని చూసి కొన్ని ఫోటో షూట్స్ చేసామో, అప్పుడే మేము ఆమె ఇచ్చిన ఎక్సప్రెషన్స్ కి ఫిదా అయిపోయాము. అక్కడ కనిపిస్తున్న ఫొటోలో చూడండి, కళ్ళలో నుండి నీళ్లు వస్తున్నాయి కదా ఆ అమ్మాయికి, దానికి ఎలాంటి కంప్యూటర్ గ్రాఫిక్స్ ని ఉపయోగించలేదు. ఆమె సహజం గానే నటించింది, ఆ తర్వాత నేను కూడా అడిగాను, ఎలా అమ్మ ఇంత సహజంగా నటించడం అని’ అంటూ కృతి సనన్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు ప్రభాస్.

ఏడాదికి మూడు సినిమాలు చేస్తాను : ప్రభాస్

ప్రభాస్ మాట్లాడుతూ ఉండగా అభిమానులు ఇంకా మాట్లాడాల్సిందిగా కోరుతారు. అప్పుడు ప్రభాస్ ఎంతో తక్కువ మాట్లాడే నేను, ఇంతసేపు మాట్లాడాను. మీకు ఏడాదికి కచ్చితంగా రెండు మూడు సినిమాలు ఇస్తాను ఇక నుండి. మనం మాట్లాడుకుంటూనే ఉంటాము, తక్కువ మాట్లాడుతాను, ఎక్కువ సినిమాలు చేస్తాను అంటూ ప్రభాస్ ఇచ్చిన స్పీచ్ హైలైట్ గా నిల్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here