టాలీవుడ్ లో మరో రచ్చ ప్రారంభం పోయిపోయి బూతు వర్మను గెలికిన నటుడు

- Advertisement -

టాలీవుడ్ లో నటుడు పృథ్వీ రాజ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పృథ్వీ రాజ్ గా కంటే ‘30 ఇయర్స్ పృథ్వీ’ అంటూ వెంటనే గుర్తుపడతారు ఆడియన్స్. సినిమాల్లో ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించే పృథ్వీ రాజ్ కు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆయన గత కొంత కాలంగా సినిమాల్లో తక్కువగా రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పలు సార్లు కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు కూడా. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై విమర్శలు గుప్పించారు.

పృథ్వీ రాజ్
పృథ్వీ రాజ్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ‘వ్యూహం’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఇదే విషయంపై పృథ్వీ రాజ్ ను అడిగితే దానికి ఆయన స్పందిస్తూ.. రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలను అసలు ప్రజలు చూడరని కొట్టిపారేశారు పృథ్వీ. గతంలో కూడా ఆర్జీవి ఇలాంటి సినిమాల తీసారని కాని వాటి ప్రభావం రాజకీయాల్లో ఏ మాత్రం ఉండదని అన్నారు. ఆర్జీవి సినిమాలను సీరియస్ గా ఎవరూ తీసుకోరని చెప్పారు. ఆయన సినిమాలు తీయడం వేస్ట్ అని అన్నారు.

RGV

దీంతో టాలీవుడ్ లో మరో రచ్చ ప్రారంభమైంది. అసలే ఇప్పటికే కావలసినన్ని గొడవలతో ఉన్న టాలీవడు ఇప్పుడు మరో గొడవ ప్రారంభం కానుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే అనసూయ, విజయ్ దేవరకొండ గోల ఒకటి ఉంది. అలాగే కరాటే కల్యాణి, మంచు విష్ణు ఇద్దరు బీభత్సంగా కొట్టుకుంటున్నారు. అలాగే ఇప్పుడు మరో మినీ యుద్దం జరగనుందని నెటిజన్లు అనుకుంటున్నారు. అందులో రామ్ గోపాల్ వర్మ గురించి విడిగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.. చూద్దాం ఏం జరుగుతుందో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here