Aadhi Pinisetty : ఛీ..ఛీ.. సిగ్గులేదా.. బహిరంగంగా ముద్దులతో రెచ్చిన పోయిన హీరోహీరోయిన్

- Advertisement -

Aadhi Pinisetty : ఆన్ స్క్రీన్ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని గురించి పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ ప్రేమించి 2022లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత నిక్కీ గల్రాని సినిమాలకు దూరమైంది. ఆది పినిశెట్టి మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. అయితే పెళ్లి అయ్యి రెండేళ్లు అవుతుండడంతో ఫ్యాన్స్ వీరి నుంచి ఓ గుడ్ న్యూస్ ని ఆశిస్తున్నారు. కానీ ఈ స్టార్ కపుల్ ఆ శుభవార్తని చెప్పకుండానే కాలం గడిపేస్తూ వస్తున్నారు. ఆ మధ్య నిక్కీ గల్రాని ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు షికారు చేశాయి. కానీ వాటిలో ఎటువంటి నిజం లేదని నిక్కీ ఒక్క పోస్టుతో అందరికి క్లారిటీ ఇచ్చేసారు.

ఇది ఇలా ఉంటే ఆది పినిశెట్టి, నిక్కీలు తాజాగా ఓ హాలిడే వెకేషన్ ట్రిప్ కోసం వెళ్లారు. థాయిలాండ్ దేశంలో వీరిద్దరూ కలిసి వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. థాయిలాండ్ దేశంలో ఉన్న ఏనుగుల సంరక్షణ క్యాంపును వీరిద్దరూ సందర్శించారు. అక్కడ వీరిద్దరూ ఏనుగులతో టైం స్పెండ్ బాగా చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ పోస్టుల్లో ఆది అండ్ నిక్కీని చూసిన నెటిజెన్స్.. లవ్లీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

ప్రస్తుతం ఆ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అందులో ఒక ఫొటో మాత్రం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కలిసి ఏనుగు ముందు నిల్చుని కిస్ పెట్టుకున్న ఫొటో చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. వైరల్ గా మారిన పోస్టులను చూసి అభిమానులు లవ్లీ కపుల్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం అందరి ముందు ఏంటా పని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ దంపతులు కూడా వేరే దేశానికి వెళ్లి అక్కడ ఏనుగుల క్యాంపును సందర్శించి తమ కూతురు క్లింకారాతో కలిసి ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here