Vijay Antony : కూతురి మరణం తర్వాత మొదటిసారి మీడియాతో మాట్లాడిన విజయ్ ఆంటోని.. ఏడిపించేశాడుగా..

- Advertisement -

Vijay Antony : కుమార్తె మరణానంతరం మొదటిసారి మీడియా ముందుకు వచ్చారు నటుడు విజయ్‌ ఆంటోనీ. తన తదుపరి చిత్రం ‘రత్తం’ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం సాయంత్రం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్న కుమార్తెతో కలిసి పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో ఇప్పటికే ఎన్నో కోల్పోయానని అన్నారు.

Vijay Antony
Vijay Antony

‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను జీవితంలో ఇప్పటికే ఎన్నో కోల్పోయా. బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా. బాధల నుంచే నేను ఎంతో నేర్చుకున్నా’’ అని ఆయన చెప్పారు. విజయ్‌ ఆంటోనీ పెద్ద కుమార్తె ఈ నెల 19న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 16 ఏళ్లకే ఆమె బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచి వేసింది. ఇకపై తాను చేసే ప్రతి సేవా కార్యక్రమాన్ని ఆమె పేరుతోనే ప్రారంభిస్తానని విజయ్‌ ఇటీవల తెలిపారు.

‘‘నా పెద్ద కుమార్తె ఎంతో దయగలది. అంతకుమించి ధైర్యవంతురాలు. కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్లిపోయింది. ఆమె ఇప్పటికీ నాతోనే మాట్లాడుతోంది. తనతో పాటే నేనూ చనిపోయాను’’ అని ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.‘రత్తం’ సినిమా విషయానికొస్తే.. మీడియా, న్యాయవ్యవస్థల మధ్య ఉన్న బంధం ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో పరిశోధక అధికారిగా, భిన్న కోణాలున్న వ్యక్తిగా విజయ్‌ కనిపించనున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here