వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విషయంలో వేణుస్వామి జోష్యం నిజమవుతుందా..

- Advertisement -

సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఒక సెలబ్రిటీ కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇక ఈయన చెప్పిన విషయాలు చెప్పినట్లుగా జరగడంతో చాలామంది సెలబ్రిటీలు ఈయన దగ్గరికి వచ్చి పూజలు చేయించుకుంటారు. ఇప్పటికే రష్మిక మందన్న,కృతి శెట్టి, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు ఈయనతో పూజలు చేయించుకున్నారట. ఇక వేణుస్వామి చాలామంది సినీ సెలబ్రిటీలపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ గానే మారుతూ ఉంటాయి.

వరుణ్ తేజ్
వరుణ్ తేజ్

సమంత నాగ చైతన్య విడిపోతారని, నయనతారకు పెళ్లి బంధం అచ్చి రాదని, రష్మిక మందన్న పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటేనే ఆమె సినీ కెరియర్ బాగుంటుందని, రకుల్ ప్రీత్ సింగ్,అనుష్క (Anushka) కి పెళ్లి బంధం అంతగా కలిసి రాదని, రామ్ చరణ్ ఉపాసనకి పిల్లలు లేటుగా పుడతారు అంటూ ఎన్నో విషయాలు చెప్పారు. అవి నిజమయ్యాయి. కాబట్టి ఇతను చెప్పాడు అంటే ఇది అక్షర సత్యం అని చాలామంది ఫిక్స్ అయిపోయారు. మొన్నటికి మొన్న 2023 లో ప్రభాస్ జాతకం చాలా వరస్ట్ గా ఉందని ఇతను చెబితే.. అది ప్రభాస్ అభిమానులను బాగా హర్ట్ చేసింది.

లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి

అలాగే ఓ టాలీవుడ్ హీరో, టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు అని అతను చెప్పాడట. వరుణ్ – లావణ్య త్రిపాఠి విషయంలో అతను చెప్పింది త్వరగా నిజమవ్వడం గమనార్హం. అలాగే ఓ యంగ్ హీరో అని వేణు స్వామి అన్నాడు కానీ తారకరత్న అని పేరు చెప్పలేదు. మరోపక్క ఓ టాలీవుడ్ హీరో, హీరోయిన్ అన్నాడు కానీ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుంటారు అని కచ్చితంగా చెప్పింది లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here